వానకొండ లక్ష్మినరసింహస్వామి
సీతారాంపురం గ్రామానికి దగ్గరిలో వానకొండ లక్ష్మినరసింహస్వామి గుట్ట ఉంది. ఈ గుట్ట
మీద నరసింహస్వామి
ఆసీనులై వున్నారు. భక్తులు కోరిన కోరికలను తిరుస్తున్నాడు. ఈ గుట్ట ప్రతి సంవత్సరం ఉగాదికి 15 రోజులు
ముందు తిరుణాలు జరుగుతాయి. ఈ తిరుణాలకు ముక్యంగా దేవరుప్పుల మండలంలోని గ్రామాల ప్రజలు
తండోపతండాలుగా నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఈ గుట్ట మీద వెలసిన లక్ష్మినరసింహస్వామి వారిని
వానకొండ లక్ష్మినరసింహస్వామిగా ఇక్కడి భక్తులు పిలుస్తారు. ఈ తిరుణాలకి భక్తులు ప్రతి ఇంటికొక ఎడ్లబండిని
కట్టి గుట్ట క్రింద మేకలను,కోళ్ళను కోసి స్వామి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఇక్కడే భక్తులు
వనభోజనముగా వండుకొని,కుటుంబ సమేతముగా బోజనము చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఈ గుట్ట క్రింద
అనేక దుకాణాలు తిరుణలుగా, భక్తులకు కనువిందును కలిగిస్తాయి.సాయంత్రసమయములో భక్తులు షాపింగ్
చేస్తారు.
No comments:
Post a Comment
kadavendisitharampuram@gmail.com
Note: only a member of this blog may post a comment.