సీతారాంపురంలో నీళ్ళ సమస్య ..?


                     సీతారాంపురం లో ఒకప్పుడు గృహూపకరనాలకు అవసరమైన నీటి కోసం గ్రామానికి దగ్గరిలోనున్న వ్యవసాయ బావి వద్ద మరియు గ్రామంలో  అక్కడక్కడా ఉండే చేతి పంపుల వద్ద బారులు తీసి గంటల కొద్ది పడిగాపులు కాసే వారు. ఇక మంచి నీటి కోసం వాగు ఒడ్డుకు పోయి క్యాన్ లల్లో, బిందలల్లో తేసుకోచ్చేవారు. మరికొందరు గ్రామంలోని  మంచి నీటి బావి కాడికి వెళ్లి తెచ్చేవారు( ఈ మంచి నీళ్ళ బావి గుంటి ఘట్టయ్య  ఇంటి ముందు ఉండేటిది). ఈ బావిలోకి దిగాలంటే ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని వేల్లసిందే ఎందుకంటే  ఆ బావిని నేను చూసినపుడు  శిధిలావస్థలో, మెట్లు చాల దూరంగా ఖనిలు ఉడిపోతాయ అన్నట్లు ఉండేవి. మన సీతారాంపురం గ్రామం, గ్రామపంచాయతిగా ఏర్పడే నాటికీ గ్రామంలో నీటి సమస్య విపరీతంగా ఉండే.

                                    
                                          గ్రామా పంచాయతి ఏర్పడిన తర్వాత మన మొదటి  గ్రామా సర్పంచ్ బస్వ రాం నర్సయ్య గారి  అధ్వర్యంలో అనేక బోర్లను, చేతి బోరు పంపులను వేఇంచడం,  నీటిని నిలువచేసే నీటి ట్యాంక్ లను నిర్మిచడం    జరిగింది మరియు పెద్ద ట్యాంక్ (ఓవర్ ట్యాంక్ ) ను కట్టి తద్వారా  ఇంటింటికీ నీటి అవసరాన్ని తీర్చడానికి వాడవాడకు నీటి పైపులైను లను వేఎంచి ప్రతి ఇంటికి నాల్లాలను ఏర్పాటు చేశారు. ఓవర్ ట్యాంక్ ని నిర్మించడం ద్వార కరంటు లేని సమయం లో కూడా నిటి సమస్య ను పారద్రోలడానికి కృషి చేశారు. గ్రామం లో ని సుమారుగా అన్ని  బోర్లు  ఉప్పు నీటి బోర్లె కావున త్రాగడానికి ఏమాత్రం అనువుగా లేకుండే, ఒక్క శివాలయం దగ్గరరుండే బోరు మాత్రమే మంచి నీటికి అనువుగా ఉండేది దానితో గ్రామ ప్రజలంతా మంచి నీళ్ళ కోసం బారులుతీసేవారు. మొత్తంమిద మన గ్రామం, గ్రామపంచాయతిగా ఏర్పడిన తరువాత నీటి విషయంలో కొంతవరకు మెరుగుపడింది. కానీ గ్రామంలో వేసిన పైపులైను మొత్తం 2 ఇంచ్లు, అక్కడక్కడ 2.50 ఇంచ్ల    పైపులను మాత్రమే   వేసి ముందు చూపు  లేకుండా వేశారనే చెప్పాలి. కానీ అప్పటి   భాద  అప్పడిదె అనట్లుగా నీటి సమస్యను మొత్తానికి విజయవంతంగా  పారద్రోలడానికి కృషి చేసినందుకు రాం నర్సయ్య గారికి కడవెండి సీతారాంపురం తరుపున అబినందనలు తెలియజేస్తున్నాను.
                                          ఇకపోతే సీతారాంపురం గ్రామ రెండవ సర్పంచ్ మరియు మొదటి మహిళా సర్పంచ్ ఐన నల్లగొండ శంకరమ్మ గారు నీటి సమస్య కోసం ఎక్కువగా కష్టా పడకుండా రాం నర్సయగారు చూపిన, చేసిన విధానాలకు అనుసరించి నీటి సమస్య రాకుండా మ్యానేజ్ చేశారంతే, కొత్తగా చేసిందేమీ  లేదు అనే చెప్పాలి కాకపోతే ఇంటింటికీ నీరు వస్తుందా లేదా అని పర్యవేక్షించేవారు. వీరి తర్వాత సీతారాంపురం గ్రామానికి మూడవ సర్పంచ్ గా బస్వ మలేష్ గారి హయంలో రాం నర్సయ్య గారు వెఇంచెన బోరులన్ని ఎండిపోయి నీటి కష్టాలు మొదలైనవి. దేనితో మలేష్ గారు గ్రామా నీటి సమస్యని తీర్చడానికి అనేక బోర్లను వెఇంచినప్పటికీ ఒక్క బోరు కూడా సరిగా   పడకపోవడంతో కొన్ని చోట్ల బోరుపంపులను బిగించి నీటి సౌకర్యని పెచారు. కానీ ప్రస్తుతం  పాత బోరులు 4 మాత్రమే నడుస్తున్నవి.  ఓవర్ ట్యాంక్ లోకి ఈ బోర్ల నీరు పోవాలంటే చాల ప్రెజర్తో నీటిని పోస్తే తప్ప అంత పైకి  ఎక్కవు 4 బోరులు కలసి 2 బోరులు పోసినట్లు  పోస్తున్నవి అంటే ఇప్పుడు సీతారాంపురం గ్రామానికి 2 బోరులే ఉన్నట్టు లెక్క , దీనిద్వారా గ్రామం లో నిటి సమస్య విపరీతంగా పెరిగింది. అక్కడక్కడ కొన్ని సేవసంఘలతో కలసి కొన్ని చేతి పంపులను వేఎంచారు కానీ ఆ నిరు చాల ఉప్పు నిరు కావున వాటి వినియోగం చాలాతక్కువ. కొన్ని బోరు పంపులు ప్రస్తుతం  కన్పిచడం లేదూ. గ్రామంలో మంచి నీటి సమస్య ని తీర్చడం కోసం నిధులు సేకరించి  శుద్ధనీటి పరికరాన్ని (వాటర్ ఫిల్టర్ మిషిన్) తెచ్చి మంచి నిటి సమస్యను సీతారాంపురం గ్రామంలో పూర్తిగా నిర్ములిన్చినందుకు కడవెండి సీతారాంపురం ద్వారా మల్లేష్ గారికి  అబినందనలు తెలియజేస్తున్నాను. కానీ గృహోపకరనలకు అవసరమైన నీటిలో మాత్రం విపలమైనారు.

                          గ్రామానికి 4వ సర్పంచ్,  రెండవసారి సీతారాంపురం గ్రామనికి  సర్పంచ్  గా వచ్చిన బస్వ మల్లేష్ గారు   ప్రస్తుత గ్రామ నీటి సమస్య గురించి పట్టించుకోని గ్రామంలో నీటి సమస్యను నిర్మూలించాలి.
                        వారికీ కడవెండి సీతారాంపురం తరుపునుండి కొన్ని సూచనలు అనికోండి, సలహాలనుకోండి ఇంకేమైనా అనుకోండి........

1)ప్రస్తుతం గ్రామంలో 4 బోర్లులే నడుస్తున్నవి, ఇంకో 5 బోరులను పడేవరకు వేఎంచాలి.
2)గ్రామంలోని అన్ని విదులల్లో ఉన్న పైపులైనులను ప్రక్షలనుగావించి, కొత్తగా   3 ఇంచుల పైపులైను లను వేఎంచాలి.
3)   బోరు బావి పంపులను పునరుద్దరించాలి.
4) ఓవర్ ట్యాంక్ వద్ద అవసరమైతే ఒక పెద్ద కులాయీ మాదిరి కట్టి, ఇక్కడినుండి మోటార్ల ద్వార ఓవర్ ట్యాంక్ లో నీటిని పొఎంచలి.
5) వీలైతే  గ్రామంలోని అన్ని విదులల్లొ ఉచిత నల్లాలను వేఇంచాలి.
6) నాల్లలను తెప్పువారు ( వాటర్ మెన్) అన్ని బజారులకు సమానముగా నీటిని విడుదల చెయ్యాలి, చేసేటట్లు చూడాలి.
7) అవసరమైతే ఒక జనరేటర్ తెచ్చి 24 గంటలు మోటారు ను నడిపించి నీటి సమస్యను తీర్చాలి.
8) ముఖ్యంగా నిటి వినియోగం పై గ్రామా ప్రజలకు అవగాహనను తేసుకరావాలి. నీరు సరిపోయీన తర్వాత నాల్లలను ముఎంచేల సూచించాలి.
9) అవసరమైతే గ్రామా ప్రజలనుండి కొన్ని నిదులను సేకరించి ఈ సమస్యలన్నీ తీర్చాలి.

       మీకు(కడవెండి సీతారాంపురం) తెలిసిన సమస్యలను కూడా జతచేయ్యండి. ఈ సమస్యలను గ్రామా సర్పంచ్ గారి దృష్టికి తేసుకేల్లడానికే  నా ఈ చిన్ని ప్రయత్నం........
(ఈ నీటి సమస్యని నేను ప్రేత్యేకంగా అనుభవించాను కనుకనే ఈ చిన్ని సలహా)

మీ,
కడవెండి సీతారాంపురం.

దసరా పండుగ వీడియో...

సీతారాంపురంలో మద్యం

మా ఊరిలో ఒక డాక్టర్ గారు మద్యం గురించి ఇలా సెలవిచ్చారు
మంచానికి పరిమితమైన ముసలోడు, పక్షవాతం వచ్చిన ముసలోడు, ఒళ్ళు నొప్పులునా కష్టజీవి, మద్యం వ్యసనంగా మారీ మంచంపట్టిన ముసలోడు, చావుకు దగ్గరైన ముసలోల్లదంరికి ఈ మద్యం ఒక మంచి తనిక్ ల పనిచేస్తుంది. వీరంతా మాంద్యాని సేవిన్చుతే వారం రోజుల్లో తిరిగి మాములు స్థితికి వస్తారు అని చెప్పాడు. ఇది ఎంతవరకు వాస్తవం? నేను యుట్యూబ్ లో ఒక డాక్టర్ గారు చెప్పింది విని అర్చేయ్యపోయాను. వీరు చెప్పింది ఏందంటే........

మనిషికి కాన్సోనంట్ స్పిరిట్ తగిన మోతాదులో అవసరం. రోజు మనిషికి
40--60 యం ఎల్ బ్రాంది, విస్కీ తీసుకుంటే హార్ట్ కు మంచిది వీటిలో ఉండే హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ఆంటి ఆక్సిడెంట్ గ పనిచేస్తాయి.
130--150 యం ఎల్ వైన్ , 350 యం ఎల్ బీర్ తీసుకుంటే మంచిది.
ఒకవేళ ఈ మోతాదుకు మించి తాగితే వాటిలో ఉండే టాక్సిస్ ప్రొడక్ట్స్ రిలీస్ అయ్యీ హార్ట్ డ్యామేజి అవుతుంది. మరొక డాక్టర్ గారు పైన చెప్పిన దానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలులేవని కాకపోతే చాల తక్కువ మొత్తంలో
అమావాస్యకో, పున్ననికో పండగలకో, పంక్షన్లకో, నెలకో, సంవత్సరానికో ఒకసారి మద్యం ని సేవిన్చితే పరవాలేదు కానీ రోజుకి,పుటకి, గంటకి, అర్ద గంటకి ఒకసారి తాగితే మాత్రం చాల ప్రమాదం అని సెలవిచ్చారు.

మా ఊరిలో ఒక్కప్పుడు దొంగచాటున సారా, కోటార్ సిసలు, బీర్లు మొదలగునవి ఒకటి , రెండు చోట్ల తప్ప మరేకడ దొరికేవి కావు. ప్రస్తుతం బ్రాంది షాప్లు 5 కు పైగానే ఉన్నవి. సాయంత్రం అయిందంటే చాలు ఎలాగు అందుబాటులో ఉంది కదా అని గ్రామా ప్రజలు మరియు యువత సహితం తక్కువ కాదు అన్నట్లు తెగ తాగుతున్నారు. తాగి రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలు, రోగాలు, పిల్లల పట్ల నిర్లక్ష్యం, ఉద్యోగ విధుల పట్ల అలసత్వం లాంటి వికృత ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది మా ఒక్క ఊరిలొని జరుగుతుంది అంటే పొరపాటు, ప్రతి ఊరిలో, ప్రతి పట్టనాలల్లో , ప్రతి దేశాలల్లో జరుగుతున్న వాస్తవం అని , మొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) కూడా పేర్కొంది. మద్యం వ్యసనంగా మారితే ఎయిడ్స్‌ కంటే ప్రమాదకారి అని కూడా తెప్పింది. ఇకపోతే మా ఊరి విషయాని కొస్తే మొన్న పండుగకు తాగి వాహనాన్ని నడపడం వల్ల ప్రమాదం జరిగి రెండు నిండు ప్రాణాలు బలైన విషయం అందరికి తెలుసు. ఆ సమయం లో మేము కొందరం కలసి మన ఊరిలో మద్యాన్ని, మద్యం షాప్లను ముషివేస్తే బాగుంటుందని చెప్పి గ్రామా ప్రజల్లో కొంతమందికి చెప్పాము , ప్రజల నుండి మాకు చేదు అనుభవం ఎదురైది . మన ఊరి లో షాప్ లు మూసివేసి నంత మాత్రాన తాగుడు బంజేస్తారా... , తాగేవాడు మన ఊరిలో కాకపోతే పక్క ఊరిలో తెచ్చుకొని తాగుతాడు...., ఈ రోజుల్లో ఎవడు తాగనోడు....., వాడు తాగి బండిని ఎందుకు నడపాలి.... , ఇలా తాగి సచ్చేటోడు సావని అన్ని కూడా సెలవిచ్చారు తప్పితే మేము బెల్ట్ షాప్ లను ముఎంచడానికి ఒప్పుకోము అన్నట్లుగా సమాదానం ఇచ్చారు. ఇదే సమస్యను సర్పంచ్ గారి దృష్టికి తేసుకేల్లుతే తప్పకుండ బెల్ట్ షాప్ లను ముఎంచడానికి కృషి చేస్తాను, మరో రెండు మూడు రోజుల్లో ముఎంచుత అనేటట్లు మాట్లాడి, హామీ ఇచ్చి 2 నెలలు దగ్గరి కోస్తున్న ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. సర్లే మన ప్రభుత్వానికి బుద్ది లేదు జనాల ప్రాణాలతో చలగాటం అడుతున్నారు. అసలు ఈ సమస్త్య ప్రపంచ సమస్యగా నేడు అందరిని పట్టిపిడిస్తుంది. ఇదంతా మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వాలు గుర్తిస్తుండటంతో ఈ సమస్య నెలకొంది.


మద్యపానం వల్ల కొన్ని నష్టాలు.......



1) ఒక్క చుక్కేఅనిఅనుకోవద్దు.కొన్నిచుక్కలుకలిసిమహాసముద్రమై జీవితాన్ని ముంచేస్తుంది.
2)మద్యపానం కుటుంబ నాశనం అని గుర్తుంచుకోవాలి.
3)మద్యం అల్లరిపాలు చేస్తుందని మరచిపోవద్దు.
4)మద్యపానం నిన్ను అప్పుల అప్పారావుగా చేస్తుంది.
5)మద్యపానం వల్ల ఒక్కోసారి ఉద్యోగాలూడతాయి.
6)మద్యపానం వల్ల ఇల్లు గుల్లవుతుందని తెలుసుకోవాలి.
7) శారీరక ,మానసిక ఆరోగ్యమ్ పై ప్రభావం చూపుతుంది.
 పురుష జన్యు లక్షణాలైన శుక్ర కణాలు నశిస్తాయి.
9)అలసిన, సొలసిన జీవితానికి త్రాగుడు కాదు, మంచి ఆహారం ముఖ్యం.
10) కేవలం మత్తును కలిగించే పదార్థాలు శాంతిని, నెమ్మదిని, విశ్రాంతినిస్తాయని తలచటం పొరబాటు. మానసిక, శారీరక విశ్రాంతిని సహజంగానే పొందడానికి అలవాటు పడాలి.
11)త్రాగుడు మా వంశపారంపర్య అలవాటు అని త్రాగే అలవాటును మీరు సమర్థించుకుంటే మీ జీవితాన్ని మీరే చేతులారా నాశనం
చేసుకున్నవాళ్ళు అవుతారన్న విషయం గ్రహించండి..
12) నరాల ఒత్తిడి, కోపం రేగినప్పుడు త్రాగుట వుత్తమం అని అనుకోవద్దు. అలా అది చిన్న పొరపాటు నుండి పెద్ద పొరపాటుకు అవుతుంది .

                                     ఖచ్చితంగా త్రాగుడు మానివేయాలి అనే దృడమైన కోరికను కలిగి వుండాలి. మద్యపానాన్ని మానలేకపోతున్నామని బాధపడేకంటే మానేందుకు మనంకనీస ప్రయత్నం చేస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి.
వీటన్నింటినీ దృష్టిలో వుంచుకుంటే మద్యపానాన్ని నీ అంతట నీవే మానివేయడానికి అవకాశం వుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మద్యం గురించి ఒక పుస్తకమే రాయవచ్చు.
ఓపికతో చదివినందుకు ధన్యవాదాలు!!

మీ,
కడవెండి సీతారాంపురం.

సీతారాంపురంలో పీర్లపండుగ


ఎక్మారే ...... రడబుషణ ..........అసేయ్  దులా............ దులా...........
మొహరం శుభాకాంక్షలు......


 పీర్లపండుగ మా గ్రామంలో కుల ,మతాలకు అతీతంగా అందరు కలసి అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ పండుగను పది రోజులపాటు ఒకొక్క సవారీని(పిర్లు) ఊరేగిస్తూ,కొరడాలతో హాల్ చల్ చేసుకుంటూ గ్రామంలోని ప్రతి వాడకు తిప్పుతారు.

చిన్నపుడైతే పీర్లపండు గోచ్చిందంటే గ్రామా పంచాయతి ముందుండే పిరీల కొట్టం కడనే ఉంట్టుటిమి. పిరీల ముందు నిప్పుల గుండం(అల్వా) ఏర్పాటు చేసేవారు ఈ నిప్పుల గుండం చుట్టూ మేమంతా చేరి రౌండ్ గా తిరుగుతూ దొరికిచ్చుకునుడు ఆట అడేటోల్లం, మా పాదాలకు, మోకలకు అంత మసి అన్టేడిది. పిరిలా దగ్గరకు వెళ్ళగానే ఊదు వాసనా గుభాలించేది, శిగం వచ్చిన వారిని చూసి భయమేసేది, కొంతమంది వేషాలు వేసుకొని అల్వా చుట్టూ తిరుగుతూ పాటలు పడేవారు. ఒకొక్క సవారిలకు ఒకొక్క పెరును పెడుతారు. రోజు ఒక సవారీని సాంబ్రాణి పొగతో లేపి ఊరు మొత్తం తిప్పుతారు. నా చిన్నప్పుడు సవారీలను ఎత్తుకోవడానికి పోటిపడేటోల్లం ముఖ్యంగా రడబుషణ సవారీని ఎత్తుకోవడానికి బడికి కూడా డుమ్మాలు కోటేటోల్లం. ఇంటి ముందుకొచ్చిన ఈ పిర్లుకు గ్రామప్రజలకు బిందదు నీళ్ళను సవారీ ఎత్తుకున్న వారి పాదాలను తడుపుతారు ఆతరువాత ఒక కొబ్బరిచెక్క, 10నుండి 100 రూపాయలవరకు సవార్లకు కట్టి, ఊదు పొగ వేసి మొక్కుతారు, ముస్లిం దగ్గరుండే నెమలి ఈకల కట్ట, నెత్తి మిదపెట్టి ఆశిర్వదిస్తాడు.

పీర్లపండుగ చివరి రోజు తల్లి సవారీని లేపుతారు, ఈ తల్లి సవారీ క్రింది నుంచి పోతే పాపాలు పోతాయని పెద్దల నమ్మకం. ఈ రోజు ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్క మొద్దుతుంటనైన తెచ్చి అల్వాలో వేస్తారు, తద్వారా మనకు మంచి జరుగుతుందని నమ్మకం. ఈ రోజు సాయంత్రం గ్రామా ప్రజలంతా అల్వా చుట్టుచేరి సవరిలను ఎత్తుకొని భజనలు,కోలాటం,జానపద పాటలు, ఆటలతో వేడుకలను జరుపుకుంటారు. సవరిలదగ్గర మటికిలు( బెల్లం నీళ్ళు ) అందరికి ఇస్తారు. ఈ పండుగ కులమతాల ఐక్యతకు ప్రతీకగ నిలుస్తోంది.

మీ,
కడవెండి సీతారాంపురం.

ప్రేమ సదనం అనాధ వృద్ద అశ్రమం

ప్రేమ సదనం అనాధ వృద్ద అశ్రమంను అనాధ వృద్దులకు సేవచేయాలనే గొప్ప ఆశయంతో ఈ అశ్రమంను యం.లక్ష్మినారాయన గారు స్థాపించారు. మన మండలం లోని చుట్టుపక్కల గ్రామాలలో ఉండే అనాధ వృద్దులను ఈ వృద్ద అశ్రమంలొ చేర్పించావలసిందిగా కోరుతున్నాను మరియు వారికైయే కర్చుల నిమిత్తము సేవ ద్రుపధం ఉన్నవారు తినుబండారాలు కానీ , బట్టలు కానీ , భూమిని కానీ , బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ మరియే ఇతర రూపంలోనైన మీ సహాయం చేయవలసింది గా కడవెండి సీతారాంపురం నుండి కోరుతున్నాను.

దాతలు సంప్రదించండి.






Mr. లక్ష్మినారాయన, ఫోన్ నెంబర్ 996358474.
మనీ రూపంలో
1. Through DD or Cheque in favour of "Prema Sadanam AVS" Andhra Bank , Payable at Deveruppula, Warangal dist, AP.
2. Online transfer or direct deposit into Current A/C: 012011011000167 , Account Name: "Prema Sadanam AVS", Bank Name: Andhra Bank Branch Name: Devaruppula, Warangal dist AP.
3. Make a permanent fixed diposit towards "Prema Sadanam AVS" in Andhra Bank and allow the monthly interest money to be used for Ashram services

ధన్యవాదాలు !!

మీ,
కడవెండి సీతారాంపురం.

మా ఊరి బతుకమ్మ పాట .........

పోరుగడ్డ మాది ఊయ్యలొ..... విప్లవాల నెల ఊయ్యలొ.....

రైతాంగ పోరాటం ఊయ్యలొ..... మొదలైంది మా ఉల్లో ఊయ్యలొ.....
విస్నూరు దొరలను ఊయ్యలొ..... వీరంగమడించె ఊయ్యలొ.....
బడిసేలు,కొడవడ్లు తో ఊయ్యలొ....బయంకర గెరిల్లా యుద్దలు ఊయ్యలొ....
రాజకర్లనేదిరిచి ఊయ్యలొ..... రణరంగమే చేసిండ్రు ఊయ్యలొ.....
ఈ రణరంగంలోన ఊయ్యలొ..... అమరుడైడమ్మ కొమురన్న ఊయ్యలొ....
మాఊరి కొమురన్న ఊయ్యలొ.. తొలి రైతాంగపోరాట అమరుడమ్మఊయ్యలొ...
మా ఊరి బతుకమ్మ ఊయ్యలొ.... బతుకు పోరాటాల గడ్డ ఊయ్యలొ....
సంతోష్,మహేష్అన్నలుఊయ్యలొ.... ఈ జగత్తుకే ఆదర్శం ఊయ్యలొ....
జాతీయ విప్లవాలలో ఊయ్యలొ.... మా ఊరే ఆదర్శం ఊయ్యలొ....
తెలంగాణా యావత్తు ఊయ్యలొ.... ఎలుగెత్తి జై కొట్టే ఊయ్యలొ....

ఆడపడుచులంత చేరి ఊయ్యలొ.... బతుకమ్మలాడంగ ఊయ్యలొ....
శివాజీ బొమ్మ ముందు ఊయ్యలొ.... శివమెత్తి అడంగా ఊయ్యలొ....
శివుని గుడిలోన ఊయ్యలొ.... శివన్న అసిస్థులతో ఊయ్యలొ....
సిరులే పండంగ ఊయ్యలొ.... హొమలె కల్చితిమి ఊయ్యలొ....
ఊరి శని పోవాలని ఊయ్యలొ.... శిని గ్రహలనే ప్రతిటించితిమి ఊయ్యలొ....
కన్నా తల్లివోలె ఊయ్యలొ... మా కన్నా లక్ష్మి నారాయణ ఊయ్యలొ....
అనాధలందరికి ఊయ్యలొ.... అనాధ ఆశ్రయం పెట్టె ఊయ్యలొ....
దుర్గమ్మ గుడిలోన ఊయ్యలొ.... వెలసినదమ్మ మా తల్లి ఊయ్యలొ....
దుర్గమ్మ అసిర్వాదలతో ఊయ్యలొ... మా అస్విత్వం చాటంగా ఊయ్యలొ....
మైసమ్మ తల్లికి ఊయ్యలొ... మొన్ననే బోనాలు చేత్తిమి ఊయ్యలొ...
మాఊరి అబివృద్దిలోన ఊయ్యలొ.. రాంనర్సయ్యను మరవజలవమ్మ ఊయ్యలొ.....
అందరి సహాయంతో ఊయ్యలొ... మంచినీళ్ళ కోసం ఊయ్యలొ...
మల్లెషన్న తెచ్చినాడమ్మ ఊయ్యలొ... మంచినీళ్ళ మిషిన్నమ్మ ఊయ్యలొ...
మా ఊరి బడిలోన ఊయ్యలొ... బలపమే పట్టితిమి ఊయ్యలొ...
బలపము పట్టిన చేతులులతో ఊయ్యలొ... పోరుజెండ పట్టి ఊయ్యలొ...
జై తెలంగాణా అనుకుంటూ ఊయ్యలొ...తెగించి పోరాటం చేసినాము ఊయ్యలొ..
తెగించి పోరాటం చేసి ఊయ్యలొ... తెలంగాణా సాదించినాము ఊయ్యలొ...
మా నీరు,మా భూమి ఊయ్యలొ...మా ఉద్యోగాలు,మా నిధులన్నీఊయ్యలొ...
మవేనని చాటంగా ఊయ్యలొ.. ఆంధ్రోడు అడ్డొచ్చే ఊయ్యలొ...
ఇసుంట రాంమంటే ఊయ్యలొ... ఇల్లంతా నాదన్నాడు ఊయ్యలొ...
తెలంగాణాను అపుదామని ఊయ్యలొ... తైతక్కలడుతుండు ఊయ్యలొ...
తెలంగాణాను ఆపలేక ఊయ్యలొ... హైదరాబాద్ మిద పడ్డాడమ్మఊయ్యలొ...
వాడు ఎన్ని జిముక్కులు చేసిన ఊయ్యలొ..హైదరాబాద్ మానదమ్మ ఊయ్యలొ..
న్యాయ ,ధర్మము ఊయ్యలొ... అధిష్టానంమే మన చెంత ఉండంగా ఊయ్యలొ...
మనకు భయమేల ఊయ్యలొ... ఒకవేల హైదరాబాద్తో కూడిన ఊయ్యలొ...
తెలంగాణా ఇయ్యాకుంటే ఊయ్యలొ... తెలంగాణాలో అధిష్టానాన్ని ఊయ్యలొ...
అగముచేద్దము ఊయ్యలొ... ఈ పోరులోన ఊయ్యలొ...
మనమే ముందుండాలి ఊయ్యలొ... అమరుల త్యాగాలను ఊయ్యలొ...
వృధకానియ్యమమ్మ ఊయ్యలొ... బతుకమ్మ బతుకమ్మ ఊయ్యలొ....
మా ఊరి బతుకమ్మ ఊయ్యలొ....


మీ,
కడవెండి సీతారాంపురం.

బిడ్డలను అడగమంది

మనల్ని పెంచి పెద్ద చేసిన మన ఊరు.... తన బిడ్డ లను ఇలా అడగమంది...

ఓనమాలు నేర్పిన మన విధిబడి.. బోసిపోతు నీకు సెలవు అడగమంది...
శివాజీ బొమ్మ బట్టలుడి సిగ్గుతో.. నీకు సెలవు అడగమంది...
కుశలం అడగమంది....... కుశలం అడగమంది...
బ్రతుకు లోకి నిన్ను పంపిన విధి రోడ్డు... గతుకులతో నీ కుశలం అడగమంది...
రోడ్డు మిద గాంధీ బొమ్మ నవ్వుతూ.. కర్ర విరిగి,వంగిపోతూ నీ త్యాగం అడగమంది...

ఈనాటి నీ కీర్తి తొలి అడుగులు, ముందు ఎవరు మోశారో గుర్తుందా.....
పొలందున్ని, దొడ్డ్లుచ్చి, పాలుపితికి, ఆనాటి చిలిపి పనులు మరువనంది...
నిన్ను ఎత్తుకు పెంచిన ముసలవ్వ, నీ క్షేమం అడుగమంది.....
ఆనాద అశ్రమంలొ అవ్వలను అధరించమనిఅడిగినది......
దుర్గమ్మ గుడిలోన హుండిల బాగోతం అడగమంది.....
విధిరోడ్ల స్తంబాలకు, విధి లైట్లనడగమనది .....
అవకాశ, అన్యాయ పంచాయతి తీర్పులను.... వందేండ్ల వేపచెట్టు అడగమంది......
ఈ కుళ్ళు రాజకీయాలతో తనను బంధినుండి విముక్తిచేయనదిగినది...
పండగపూటా ఇల్లు కడగా......నీళ్ళనడిగినది.......
దొర్లు పోవు కాలంలో దొరలా నివ్వు ఎదగాలని, ఎవ్వరు తపస్సు చేసారో..
పొర్లు పొర్లు దండాలతో మొక్కుకుంటూ నీ తల్లి, నిరసించి నీ క్షేమం అడుగమంది.....
బరువుకాకు బ్రతుకులోన ఎప్పుడు.... ఎవ్వరికి... ఓ మనసా.......



కడవెండి సీతారాంపురం.

సీతారాంపురంలో భోనాల పండుగ

భోనాల పండుగ సీతారాంపురం న్యూస్ లైన్ 25 ఆగష్టు :-దేవరుప్పుల మండలం లోని సీతారాంపురం గ్రామంలో ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాల పండుగను జరుపుకున్నారు. మహిలలు కొత్త బట్టలు ధరించి బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు.ఈ పండుగను గ్రామా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉత్సవాల్లో గ్రామా పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.



స్వాతంత్ర్య దినోత్సవం--- సీతారాంపురం

స్వాతంత్ర్య దినోత్సవం (ఆగష్టు 15,1947) దేశం బానిస సంకెళ్ళు నుండి విముక్తి పొందిన రోజు.
దేశమంతటా సంబరాలు జరుపుకునే రోజు , స్వాతంత్ర్యము కోసం పోరాడిన వీరులను తలుచుకుంటూ దేశ పతాకాన్ని ,జాతీయ గేయాన్ని పాడుతూ జాతి ఐక్యమత్యాన్ని గౌరవించే రోజు. ఈ గొప్ప పండుగను దేశమంతట ఎలా అయితే జరుపు కొంటున్నమో కడవెండి సీతారాంపురంలో కూడా అలాగే జరుపుకుంటారు.
గ్రామ ప్రజలు అధిక భక్తి శ్రద్ధలతో గ్రామంలోని వివిధ ప్రాంతాలలో ఈ జెండా వందనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని చివరిగా గ్రామ ప్రాధమిక విద్యశాలలోసమావేశామౌతారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హజరౌతారు. ప్రాధమిక విద్య ప్రధానోపాద్యయ సమక్షంలో జెండా వందనం పూర్తి అయిన తర్వాత గ్రామ ప్రముఖులను స్టేజి ఫై ఆహ్వానించి ,ఈ పండుగను ఎందుకు జరుపుకొంటున్నమో తెలియజేస్తూ, గ్రామాభివృద్ది కై చేర్చిచుకుంటారు.అటుపై కొన్ని క్రీడాకార్యక్రమాలను ఏర్పాట్లు చేస్తారు. ఈ క్రీడాకార్యక్రమలలో యువత ఆశక్తి తో పాల్గొంటారు.వీటిలో ముఖ్యమైన రాష్టక్రీడ కబడ్డీ కచ్చితంగా ఏర్పాటుచేస్తారు. సాయంత్రం గ్రామ పంచాయతి ముందు సంస్సృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి గేలుపొందిన వారందరికి భాహుమతులు ప్రాదానం చేస్తారు. కానీ...........
ఇదంతా నాటి మాట....................................

మరి నేటి మాట
.....................................

స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఇదేదో మొక్కుబడిగా సాగే ఒక కార్యక్రమంగా మారింది.అప్పుడెప్పుడో దేశం కోసం కొందరు పోరాటాలు చేసారు అందుకే ఈ రోజు మాకు చాక్లెట్లు ,బిస్కెట్లు ఇస్తున్నారు అనే అబిప్రాయం విద్యార్ధులలో కలగడం,యువత సైతం అదే అబిప్రాయంలో ఏదో జరుపుకోవాలిగా అన్నట్లుగా ఈ పండుగను కొనసాగిస్తూoడటం,దేశమంతటా ఇలాగే కొనసాగుతుండడంతో కడవెండి సీతారాంపురంలో సైతం మొక్కుబడిగా సాగిస్తున్నారు.
ఈ పండుగలో చెప్పుకోదగ్గ ఆశక్తి కనిపించకపోవటంతో, సీతారాంపురం గ్రామ ప్రజలు కనీసం ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం విచారకరం. గ్రామాభివృద్ది కొరకు మాట్లాడే స్టేజిలు లేవు అసలు మాట్లాడేవారే లేరు.ఇక గేమ్స్ సంగతి అంతే ఆడాలన్న ఆటస్థలాలూ లేవు ,అసలు ఆడేవారీ లేరు. ఒకవేళ మేము ఆడుతామన్నఆటలుపెట్టేవరే లేరు.

గ్రామ ప్రజలందరిలో ఒక యూనిట్ గా తిసుకోనిరావలసిన అవసరం మనందరికుంది.రండి చెయ్ చెయె కలుపుదాం చైతన్యన్ని తిసుకోద్దం.

జన సముద్రంగా రండి జనగణమన పడడానికి.....
క్రీడాశక్తితో రండి కిరీటాన్ని జయించడానికి......

మీ,కడవెండి సీతారాంపురం


వానకొండ లక్ష్మినరసింహస్వామి

సీతారాంపురం గ్రామానికి దగ్గరిలో వానకొండ లక్ష్మినరసింహస్వామి గుట్ట ఉంది. ఈ గుట్ట 

మీద నరసింహస్వామి 

ఆసీనులై వున్నారు. భక్తులు కోరిన కోరికలను తిరుస్తున్నాడు. ఈ గుట్ట ప్రతి సంవత్సరం ఉగాదికి 15 రోజులు 

ముందు తిరుణాలు జరుగుతాయి. ఈ తిరుణాలకు ముక్యంగా దేవరుప్పుల మండలంలోని గ్రామాల ప్రజలు 

తండోపతండాలుగా నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఈ గుట్ట మీద వెలసిన లక్ష్మినరసింహస్వామి వారిని 

వానకొండ లక్ష్మినరసింహస్వామిగా ఇక్కడి భక్తులు పిలుస్తారు. ఈ తిరుణాలకి భక్తులు ప్రతి ఇంటికొక ఎడ్లబండిని 

కట్టి గుట్ట క్రింద మేకలను,కోళ్ళను కోసి స్వామి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఇక్కడే భక్తులు 

వనభోజనముగా వండుకొని,కుటుంబ సమేతముగా బోజనము చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఈ గుట్ట క్రింద 

అనేక దుకాణాలు తిరుణలుగా, భక్తులకు కనువిందును కలిగిస్తాయి.సాయంత్రసమయములో భక్తులు షాపింగ్ 

చేస్తారు.