సీతారాంపురంలో నీళ్ళ సమస్య ..?


                     సీతారాంపురం లో ఒకప్పుడు గృహూపకరనాలకు అవసరమైన నీటి కోసం గ్రామానికి దగ్గరిలోనున్న వ్యవసాయ బావి వద్ద మరియు గ్రామంలో  అక్కడక్కడా ఉండే చేతి పంపుల వద్ద బారులు తీసి గంటల కొద్ది పడిగాపులు కాసే వారు. ఇక మంచి నీటి కోసం వాగు ఒడ్డుకు పోయి క్యాన్ లల్లో, బిందలల్లో తేసుకోచ్చేవారు. మరికొందరు గ్రామంలోని  మంచి నీటి బావి కాడికి వెళ్లి తెచ్చేవారు( ఈ మంచి నీళ్ళ బావి గుంటి ఘట్టయ్య  ఇంటి ముందు ఉండేటిది). ఈ బావిలోకి దిగాలంటే ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని వేల్లసిందే ఎందుకంటే  ఆ బావిని నేను చూసినపుడు  శిధిలావస్థలో, మెట్లు చాల దూరంగా ఖనిలు ఉడిపోతాయ అన్నట్లు ఉండేవి. మన సీతారాంపురం గ్రామం, గ్రామపంచాయతిగా ఏర్పడే నాటికీ గ్రామంలో నీటి సమస్య విపరీతంగా ఉండే.

                                    
                                          గ్రామా పంచాయతి ఏర్పడిన తర్వాత మన మొదటి  గ్రామా సర్పంచ్ బస్వ రాం నర్సయ్య గారి  అధ్వర్యంలో అనేక బోర్లను, చేతి బోరు పంపులను వేఇంచడం,  నీటిని నిలువచేసే నీటి ట్యాంక్ లను నిర్మిచడం    జరిగింది మరియు పెద్ద ట్యాంక్ (ఓవర్ ట్యాంక్ ) ను కట్టి తద్వారా  ఇంటింటికీ నీటి అవసరాన్ని తీర్చడానికి వాడవాడకు నీటి పైపులైను లను వేఎంచి ప్రతి ఇంటికి నాల్లాలను ఏర్పాటు చేశారు. ఓవర్ ట్యాంక్ ని నిర్మించడం ద్వార కరంటు లేని సమయం లో కూడా నిటి సమస్య ను పారద్రోలడానికి కృషి చేశారు. గ్రామం లో ని సుమారుగా అన్ని  బోర్లు  ఉప్పు నీటి బోర్లె కావున త్రాగడానికి ఏమాత్రం అనువుగా లేకుండే, ఒక్క శివాలయం దగ్గరరుండే బోరు మాత్రమే మంచి నీటికి అనువుగా ఉండేది దానితో గ్రామ ప్రజలంతా మంచి నీళ్ళ కోసం బారులుతీసేవారు. మొత్తంమిద మన గ్రామం, గ్రామపంచాయతిగా ఏర్పడిన తరువాత నీటి విషయంలో కొంతవరకు మెరుగుపడింది. కానీ గ్రామంలో వేసిన పైపులైను మొత్తం 2 ఇంచ్లు, అక్కడక్కడ 2.50 ఇంచ్ల    పైపులను మాత్రమే   వేసి ముందు చూపు  లేకుండా వేశారనే చెప్పాలి. కానీ అప్పటి   భాద  అప్పడిదె అనట్లుగా నీటి సమస్యను మొత్తానికి విజయవంతంగా  పారద్రోలడానికి కృషి చేసినందుకు రాం నర్సయ్య గారికి కడవెండి సీతారాంపురం తరుపున అబినందనలు తెలియజేస్తున్నాను.
                                          ఇకపోతే సీతారాంపురం గ్రామ రెండవ సర్పంచ్ మరియు మొదటి మహిళా సర్పంచ్ ఐన నల్లగొండ శంకరమ్మ గారు నీటి సమస్య కోసం ఎక్కువగా కష్టా పడకుండా రాం నర్సయగారు చూపిన, చేసిన విధానాలకు అనుసరించి నీటి సమస్య రాకుండా మ్యానేజ్ చేశారంతే, కొత్తగా చేసిందేమీ  లేదు అనే చెప్పాలి కాకపోతే ఇంటింటికీ నీరు వస్తుందా లేదా అని పర్యవేక్షించేవారు. వీరి తర్వాత సీతారాంపురం గ్రామానికి మూడవ సర్పంచ్ గా బస్వ మలేష్ గారి హయంలో రాం నర్సయ్య గారు వెఇంచెన బోరులన్ని ఎండిపోయి నీటి కష్టాలు మొదలైనవి. దేనితో మలేష్ గారు గ్రామా నీటి సమస్యని తీర్చడానికి అనేక బోర్లను వెఇంచినప్పటికీ ఒక్క బోరు కూడా సరిగా   పడకపోవడంతో కొన్ని చోట్ల బోరుపంపులను బిగించి నీటి సౌకర్యని పెచారు. కానీ ప్రస్తుతం  పాత బోరులు 4 మాత్రమే నడుస్తున్నవి.  ఓవర్ ట్యాంక్ లోకి ఈ బోర్ల నీరు పోవాలంటే చాల ప్రెజర్తో నీటిని పోస్తే తప్ప అంత పైకి  ఎక్కవు 4 బోరులు కలసి 2 బోరులు పోసినట్లు  పోస్తున్నవి అంటే ఇప్పుడు సీతారాంపురం గ్రామానికి 2 బోరులే ఉన్నట్టు లెక్క , దీనిద్వారా గ్రామం లో నిటి సమస్య విపరీతంగా పెరిగింది. అక్కడక్కడ కొన్ని సేవసంఘలతో కలసి కొన్ని చేతి పంపులను వేఎంచారు కానీ ఆ నిరు చాల ఉప్పు నిరు కావున వాటి వినియోగం చాలాతక్కువ. కొన్ని బోరు పంపులు ప్రస్తుతం  కన్పిచడం లేదూ. గ్రామంలో మంచి నీటి సమస్య ని తీర్చడం కోసం నిధులు సేకరించి  శుద్ధనీటి పరికరాన్ని (వాటర్ ఫిల్టర్ మిషిన్) తెచ్చి మంచి నిటి సమస్యను సీతారాంపురం గ్రామంలో పూర్తిగా నిర్ములిన్చినందుకు కడవెండి సీతారాంపురం ద్వారా మల్లేష్ గారికి  అబినందనలు తెలియజేస్తున్నాను. కానీ గృహోపకరనలకు అవసరమైన నీటిలో మాత్రం విపలమైనారు.

                          గ్రామానికి 4వ సర్పంచ్,  రెండవసారి సీతారాంపురం గ్రామనికి  సర్పంచ్  గా వచ్చిన బస్వ మల్లేష్ గారు   ప్రస్తుత గ్రామ నీటి సమస్య గురించి పట్టించుకోని గ్రామంలో నీటి సమస్యను నిర్మూలించాలి.
                        వారికీ కడవెండి సీతారాంపురం తరుపునుండి కొన్ని సూచనలు అనికోండి, సలహాలనుకోండి ఇంకేమైనా అనుకోండి........

1)ప్రస్తుతం గ్రామంలో 4 బోర్లులే నడుస్తున్నవి, ఇంకో 5 బోరులను పడేవరకు వేఎంచాలి.
2)గ్రామంలోని అన్ని విదులల్లో ఉన్న పైపులైనులను ప్రక్షలనుగావించి, కొత్తగా   3 ఇంచుల పైపులైను లను వేఎంచాలి.
3)   బోరు బావి పంపులను పునరుద్దరించాలి.
4) ఓవర్ ట్యాంక్ వద్ద అవసరమైతే ఒక పెద్ద కులాయీ మాదిరి కట్టి, ఇక్కడినుండి మోటార్ల ద్వార ఓవర్ ట్యాంక్ లో నీటిని పొఎంచలి.
5) వీలైతే  గ్రామంలోని అన్ని విదులల్లొ ఉచిత నల్లాలను వేఇంచాలి.
6) నాల్లలను తెప్పువారు ( వాటర్ మెన్) అన్ని బజారులకు సమానముగా నీటిని విడుదల చెయ్యాలి, చేసేటట్లు చూడాలి.
7) అవసరమైతే ఒక జనరేటర్ తెచ్చి 24 గంటలు మోటారు ను నడిపించి నీటి సమస్యను తీర్చాలి.
8) ముఖ్యంగా నిటి వినియోగం పై గ్రామా ప్రజలకు అవగాహనను తేసుకరావాలి. నీరు సరిపోయీన తర్వాత నాల్లలను ముఎంచేల సూచించాలి.
9) అవసరమైతే గ్రామా ప్రజలనుండి కొన్ని నిదులను సేకరించి ఈ సమస్యలన్నీ తీర్చాలి.

       మీకు(కడవెండి సీతారాంపురం) తెలిసిన సమస్యలను కూడా జతచేయ్యండి. ఈ సమస్యలను గ్రామా సర్పంచ్ గారి దృష్టికి తేసుకేల్లడానికే  నా ఈ చిన్ని ప్రయత్నం........
(ఈ నీటి సమస్యని నేను ప్రేత్యేకంగా అనుభవించాను కనుకనే ఈ చిన్ని సలహా)

మీ,
కడవెండి సీతారాంపురం.

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.