మీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.
మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు
...........
మారిపోయిన పల్లె జీవనం... కనుమరుగవుతున్న ఆ ఆత్మీయ జీవితం.
ఎదుగుతున్న దేశంలో... విదేశీ సంపద ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతుంటే
అందినంత అందుకోవాలనే ఆత్రంతో నగరానికి పరుగులు పెడుతున్న మన పల్లె వాసులు..

నేను కేరింతలు కొట్టిన ఆ చెరువు గట్ట్లు.. ఇప్పుడు అంబరాన్ని తాకే కాంక్రీటు ప్లాట్లు.
నేను ఎక్కిన ఆ తియ్యటి జామ చెట్టు...నేను కోసిన ఆ సీతాఫల కొమ్మ
ఇప్పుడు ఆ కాంక్రీటు గోడల మధ్య నీర్జీవంగా వేలాడే ఉయ్యాల దిమ్మ..

సాయం సంధ్యల్లో ఆరుబయట కూర్చున్నప్పుడు రివ్వున ఎగురుతూ తీతువు పిట్ట చేసే సరాగాలు ఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతి తో వెలిసిన బార్లో మనుషులు చేసే వికారాలు.
యాంత్రిక జీవనంలో తాత్కాలికంగా..తార్కికంగా...తాంత్రికంగా
మాట్లాడే మనుషుల మధ్యకు వెళుతున్న ఓ పల్లె జీవులారా

మీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.
మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు.

మీ కోసం ఎదురుచూస్తుంది మన గ్రామం...
పండగలకైన ఒక్క సారి వచ్చి పొమ్మంటుంది..
గ్రామం గురించి ఒక్క నిముషం ఆలోచించమని వేడుకొంటుంది.

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి....
మా పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
మా పంట చేల గట్ల మీద నడవాలి..


ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..


గంగాపురం దాటితే మా ఊరు..
మా ఊరు దాటితే దొడ్డి కొమురయ్య ఊరు..
గంగాపురం దాటితే మా ఊరు..
మా ఊరు దాటితే దొడ్డి కొమురయ్య ఊరు..


ప్రేమతో పలకరించే ప్రేమ సదన్ ను..
అన్నితానై చూసే మా లక్ష్మి నారాయణ..
ప్రేమతో పలకరించే ప్రేమ సదన్ ను...
అన్నితానై చూసే మా లక్ష్మి నారాయణ.. 


ఊరి మధ్య గాంధీ బొమ్మ...
గాంధీ పక్కన శివాజీ బొమ్మ..
ఒకసారి చూస్తిరా తిరిగి పోలేరు..
ఊరి మధ్య గాంధీ బొమ్మ...
గాంధీ పక్కన శివాజీ బొమ్మ..
ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు..


పంట చేల గట్ల మీద తిరగాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..


పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...
పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...


ఏరు దాటి వానకొండ గుట్టకి నే పోవాలి..
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి...
ఏరు దాటి వానకొండ గుట్టకి నే పోవాలి..
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి...


మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..

చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...


చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...

ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...


పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.

 మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి.
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..


మీరు ఒక్కసారి చూస్తే చాలు మా ఊరు ...
ఈ లోకాన్నే మైమర్చేరు ..

అమ్మ చేతి వంట..

పండగలకి, అప్పుడప్పుడు ఊరిలోకి వెళ్ళినప్పుడు అమ్మ చేతి వంట తింటే ఉంటుంది అదో అమృతం అంటే నమ్మండి. అమ్మప్రేమాప్యాయతలతో వండిన ఆ వంట కమ్మదనం కట్టిపడేస్తుంది. ఎన్ని 5 స్టార్ హోటళ్ళలో తిన్నా అమ్మ చేతి వంట కింద ఏ రుచీ సరిరాదు. ఆదేందో అర్దంకాదు బ్యాచిలర్ గా రూం లో 1 కేజీ చికెన్ వండుకుంటే 2 పుటలకు కూడా సరిపోదు ఆదే అమ్మ వండితే, ఇంటిల్లపాది 3 పుటల తినంగ మరుసటి ఉదయానికి సరిపోతుంది. అంత అమ్మ చేతి మహిమా.. అమ్మ నా ఆకలిని మాత్రమే కాక రుచులెరిగి , నా మనసు తెలుసుకుని తన ప్రేమనీ, మమతనీ రంగరించి వండే అమ్మ చేతి వంట అంటే నాకెంతో ఇష్టం. ఊర్లో ఉన్నని రోజులు అసలు ఎన్నిపుటలా తిన్నామో కూడా లెక్క లేదు.. ఆసలు ఆకలంటే కూడా తెలియదు. కానీ ఆదే పట్టణానికి వచ్చినరోజు ఉంటుంది ఆకలి అంటే ఇదే అన్నట్లు కడుపులో పేగులు గిరగిర తిరుగుతాయీ.. వంట వండాలంటే బద్దకంగా ఉంటుంది. మళ్ళి అంత రొటీన్ లైఫ్.. కానీ అమ్మచేతి వంట తింటే మాత్రం అంతులేని సంతృప్తి కలుగుతుంది. మళ్ళి అమ్మ చేతి వంట కోసం ఎదురుచూస్తూ...
మీ,
కడవెండి సీతారాంపురం.

ఉపాధి కోల్పోయి వలసబాట పడుతున్న సీతారాంపురం గ్రామస్తులు...


కడవెండి సీతారాంపురం,న్యూస్‌లైన్(డిసెంబర్ 28): గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా చాలా గ్రామాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు. వివరలోకేల్లితే ఈ సారి వర్షాలు లేని కారణంగా దేవరుప్పుల మండల ప్రాతాలలో ఎక్కడ కూడా చెరువులు, కుంటలు, వాగుల్లో నీరు నిండలేదు. దీనితో భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావుల్లో నీటి మట్టం తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 100 కు పైగా బస్తాలు పండించిన రైతులు నేడు వర్షాలు లేక పొలాలు బీడుపడి పల్లెలను వదిలి వలస బాటపడుతున్నారు. ఉపాధి కరువై అప్పులపాలయ్యారు. అందరి ఆకలి తీర్చే అన్నదాత పొట్ల చేత పట్టుకొని పట్టణాల లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా అవతారమెత్తారు. గ్రామంలో బోర్లన్ని అడుగంటి పోయీ, దిక్కు తోచని పరిస్థిలో రైతులు దయనీయమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు.వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలెట్టాక పోవడంతో వ్యవసాయ కూలీలు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితే కనుక మరో సంవత్సర కాలం కొనసాగితే మా గ్రామం, మాలాంటి అనేక గ్రామాలు ఖాళీ అవుతాయనడానికి సందేహం లేదు .తక్షణం తెలంగాణా ప్రభుత్వం వలసల నివారణ కోసం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైతులకు జీవనభృతి కింద ప్రత్యేక ప్యాకేజీని పంపిణీ చేయాలని "కడవెండి సీతారాంపురం" తరుపున ప్రభుత్వానికి డిమాండ్‌ చేస్తుంది.
రైతుల వలసలపై కడవెండి సీతారాంపురం అడ్మిన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మీ,
కడవెండి సీతారాంపురం.

మరిచిన హామీలు..


కడవెండి సీతారాంపురం, డిసెంబర్ 24: గత సంవత్సరం జరిగిన గ్రామా పంచాయతి ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చి, గెలుపొందిన సీతారాంపురం గ్రామా సర్పంచ్ బస్వ మల్లేష్ తన హామీలను మరిచారు.
పోచమ్మ గుడిని కట్టిస్తానని ఎన్నికల సమయంలో హామీఇచ్చి సంవత్సర కాలం గడిచిన ఎలాంటి పనులు మొదలెట్టలేదు. ఈ పేస్ బుక్ ద్వార సర్పంచ్ దృష్టికి తెసుకేల్లడం దీని ఉదేశ్యం. సర్పంచ్ గారు కూడా పేస్ బుక్ ను ఒక వేదికగా మలుచుకోవాలని, సీతారాంపురం గ్రామా యువతరం అబిప్రాయాలు తెసుకోవాలని, తదనుగుణంగా సలహాలు, సూచనలు తీసుకోవాలని కడవెండి సీతారాంపురం తరుపున విన్నవించుకుంటూ...

మీ
కడవెండి సీతారాంపురం.

కృతజ్ఞతలు..

చిల్డ్రన్స్  డే సందర్బంగా...
14/11/2014

నన్ను ఈ భూమిమీద పుట్టిన్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు...
నన్ను నవమాసాలు మోసి కనిపెంచి, నేను ఆడుకోవడానికి ఆట వస్తువులనిచ్చి, చదువుకోవడానికి పుస్తకాలు కొనియీచ్చి, వేసుకోవడానికి బట్టలకు కుట్టిచ్చి, ఆలోచిచడానికి   మెదడు ఇచ్చి, శక్తినిచ్చి, నడవడానికి , పరిగేతడానికి రెండు కాళ్ళనిచ్చి, చూడటానికి  రెండు కన్నులనిచ్చి, పూర్తగా ఆరోగ్యంగా పుట్టించి,  ఈ సమాజంలో నేను బ్రతికెల ప్రోత్సహించిన అమ్మానాన్నలకు పాదాభివందనాలు...   
నా బాల్యం మా గ్రామం సీతారాంపురం  పరిసరాలలో గడిచింది, మా గ్రామా ప్రకృతిలో శుభ్రమైన గాలి, స్వచ్చమైన నీరు, విశాలమైన నేల, పైన సూర్యుడు, కింద చెరువులు, లెక్కించడానికి ఆకాశంలో చుక్కలు, ఇలా ప్రకృతి నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞాతుడను... 
పెన్నును , కరంటును, టీవీ , ఆటలు,ఆట వస్తువులు, వాహనాలను, సెల్ ఫోన్ , ఇంటర్నెట్, ఇలా వివిధ ఆధునికా  సదుపాయాలను సృష్టించిన మేధావులందరికీ వందనాలు..

నా బాల్యం..

ఆకలితో ఆలమ టించలేదు..
ఆర్దిక ఇబ్బందుల్లో నలిగిపోలేదు..
చదువుకు దూరం చేయలేదు..
నేర చరిత్ర తో ముడిపడలేదు..
దొంగాతనలతో దోషిగా నిలువలేదు..
చెత్తకుప్పల చుట్టూ తిరుగలేదు..
వెట్టి చాకిరికి గురికాలేదు.. 
మత్తుపానీయాలకు బానిస కాలేదు..
లైంగిక వేదింపులకు బలైపోలేదు..
తిట్లు, దండలనతో దద్దరిల్లలేదు..
కోదండం, బెంచికుర్చీలతో ఆర్తనాదాలు పెట్టలేదు..
కోపంతో, మంకు పట్టుతో ఇల్లు విడువలేదు..
నేర స్నేహింతులతో చెలిమి చేయలేదు..
పెద్ద పెద్ద ఆడంబరాలకుపోయి కన్నోలని కష్టపెట్టలేదు..
ఇవ్వన్ని ప్రసాదించిన ఈ ప్రకృతికి నేను రుణపడి ఉన్నాను..

నా బాల్యం మా  గ్రామంలో సాఫీగానే సాగినా ఎక్కోడో కొంత వెల్తి కనపడుతూనే ఉంది..
నన్ను ఎత్తుకు పెంచిన అమ్మమ్మ, తతయ్యలకు ధన్యవాదాలు..
నా అలన పాలనా చుసిన మా అక్క కాళ్ళకి నమస్కారం..
నా చిట్టి పొట్టి ఆడుగులను మోసిన మా గ్రామా విధులకు కృతజ్ఞాతుడను..
నాతో చెలిమి చేసినా నా మిత్రులకు ప్రణామాలు..
నాకు బుద్దులు నేర్పిన ఉపాధ్యయులందరికి పాదాభివందనాలు..
నా వ్యక్తిత్వం ( మనస్తత్వం) నికి పునాది పడిన నా గ్రామానికి   సాష్టాంగ నమస్కారం..  
నేను ఒకడిని ఉన్నానని గుర్తించిన ఈ సమాజానికి శతకోటి వందనాలు..

ఈ సమస్త సృష్టిని సృష్టిచిన ఆ శక్తి ( దేవుడికి) భక్తిపూర్వకం గా నమస్కారాలు తెలుపుకుంటూ..
మా వనకొండ లక్ష్మి నరసింహుడి సాక్షిగా..
మా పాలకుర్తి సోమన్న సన్నిదిలో..
నన్ను కన్న మా తల్లిదండ్రులకు..
నాకు పరిచయమైనా ఈ సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ..

మీ
కడవెండి సీతారాంపురం @admin


దొడ్డి కొమురయ్య పై చిన్న పాట..


ఉద్యమాల సూర్యుడే ఓయమ్మా ఉదయించినడమ్మ..
విప్లవాల వీరుడే ఓయమ్మా దొడ్డి కొమురన్న..
చరిత్ర గల మా ఊరు కడవెండి..
కడవెండి వీరుడు కొమురన్న .. దొడ్డి కొమురన్న
తెలంగాణా పోరాట వీరుడు..
తొలి తెలంగాణా రైతాంగ పోరాట అమరుడు..
తుపాకి తూటకు ఎదురొడ్డి నిలిచినాడమ్మ..
ఆ తుపాకి గుండే తన గుండెను చిల్చుతూ ఎర్రబారెను..
ఎర్ర బారిన నెత్తుటితోని తడిసి పోయెరా కడవెండి..
మీ స్పూర్తి తో ముందుకు సాగేన నర్సింహులు
మీ పోరాట బాటలో నడిచేరా సంతోష్‌డ్డి, మహేష్ అన్నలు ..
ఇలా ఎందరో మరెందరో నేలకోరిగేరా మా వీరపుత్రులు..
విస్నూరు దొరలను ఎదిరించి నేలకోరిగిన ఆనాటి మా వీర పుత్రులు ఎందరో..
నేటికి కూడా బడుగుల కోసం పోరాడే ఉసెండి..
మీ త్యాగం మేం మరవజాలం..
మీరు పుట్టిన ఈ గడ్డ మీద మేం పుట్టినోల్లం..
మీ బాటలు వేరైనా , మా దారులు మరేదైనా ..
మీ ఆలోచన, గమనంలో సారూప్యం లేకున్నా..
ప్రజాస్వామ్యయుతముగా పోరాడి..
మీ లక్ష్యం లో కొంతైన సాదించా పోరాడుతాం..
కడవెండి విప్లవ విరుల్లరా..
మీకిదే నా లాల్ సలాం..!
మీకిదే నా లాల్ సలాం..!
జోహార్లు అమరవీరులకు.. జోహార్లు జోహార్లు..
కడవెండి వీర పుత్రులకు జోహార్ జోహార్..

మీ
కడవెండి సీతారాంపురం

స్వచ్చ భరత్

  పరిశుభ్ర భరత్:

 గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావని, కోసం మోడీ గారు  పరిశుభ్ర భరత్ కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమనికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ కనిపితుంది. దీనిలో బాగంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమన్ని చేపడుతున్నారు చాల సంతోషం కాని...

ఈ  కార్యక్రమం గ్రామా , పట్టణ పరిదిలో  నిర్వహించే అధికారులు, నాయకులూ, పేపెర్ లో ఫోటోలకు పోజులు ఇవ్వడానికే అన్నట్లు నిర్వహిస్తున్నారు. వేస్తుకున్న బట్టలకు ఇస్తిరి  అచ్చులు  కుడా నలగకుండా రోడ్లు ఉడుస్తున్నారంటే  ఎంత విడ్డూరమో అర్ధం చేసుకోవాలి. మన దేశంలో ఎ కార్యక్రమం మొదలు పెట్టిన ఎక్కడలేని అర్బాటంతో మొదలవుతుంది కానీ లక్ష్యం నెరవేరే వరకు ఈ ఉచ్చాహం మన లో ఉండదు. ఈ  పరిశుభ్ర భరత్ చాల గొప్పది... మనం నివసించే దగ్గర పరిసరాలు పరిశుభ్రంగా ఉంటె , మన కు ఎలాంటి రోగాలు రావు, కాలుష్యానికి కూడా తావుండదు తద్వారా అందరు ఆరోగ్యంగా ఉండి దేశాబివృద్దిలో పలుపంచుకోవచును అని ఆనాడే గాంధీ గారు గుర్తించారు. ఈ పని అప్పుడే చేసివుంటే బారత్ అబివృద్ది చెందిన దేశంగా మొదటి స్థానం లో ఉండేటిది, ఆలస్యం ఐన మోడీ గారు గుర్తించి ఈ మంచి పనికి శ్రీకారం చుట్టినందుకు మోదిగారికి ధన్యవాదాలు.. ఇక నిర్లక్యం చేయకుండా ప్రతి ఒక్కరు "పరిశుభ్ర భరత్ " కోసం పనిచేద్దాం.

మన ఇంటి వద్ద నుండే   చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త కుండిలలోని వేద్దాం. మన వంతుగా మొదటి అడుగు వేద్దాం.


మీ,
కడవెండి సీతారాంపురం.

దసరా పండుగ మా ఊరిలో...

దసరా పండుగ మా ఊరిలో...

చిన్నగున్నపుడు  దసరా, బతుకమ్మ  పండుగలు వస్తునాయంటే  చాల  సంతోషంగా ఉండేడిది.స్కూలుకు సెలవులు వస్తునాయని, మేనత్తో లేక  అక్కో వారిపిల్లలతో  ఇల్లు సందడిగుడేడిది. నలుగు రోజుల ముందే వచ్చేటోల్లు , పిల్లలందరూ గౌరమ్మ లను పేర్చి ఇంటి ముందు అడుకుటోల్లు, ఊర్లో గల్లికోగౌరమ్మని పేటి ఆడుతుంటే చూసి ఎన్ని రోజులైందో. ఈ ఆదునిక కాలంలో ఒక్క రోజు పండుగకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు మన ఆడపడుచులు. కాలం మారుతుంది మన సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవడం ఇకముందు గగనమే కావస్తుంది కాబోలు. బతుకమ్మల చుట్టూ చప్పట్లతో, బతుకు పాటలతో చూడ చక్కగా అడుకుటోల్లు మన అమ్మలు, అమ్మమ్మలు మరి ఇప్పుడు బతుకమ్మలాడే ఆడపడుచులు ఆదునిక పోకడలతో డాన్సులు, కోలాటాలు , పిచ్చిపిచ్చి డాన్సులతో మన సంస్కృతిని పక్కదోవ పట్టిస్తున్నారు.  ఆంధ్ర పాలకులు  మన  సంస్కృతి,సంప్రదాయాలు కనుమరుగు చేశారు. ఏది మన సంస్కృతో , ఏది మన పండుగో తెలియకుండా మొత్తం వారి సంస్కృతి గురించే తెలుసుకొనేల చేశారు. ఇప్పుడు మనం చేయవలసింది మన సంస్కృతి,సంప్రదాయాలను మన పిల్లలకు,వారి పిల్లలకు అందించాలి కావున పాశ్చత్య   పోకడలకు పోకుండా మన తెలంగాణా సంస్కృతి ని మనం పాటించి ముందుతరాలకు ఆదర్శంగా నిలువాలి.

                                  

         ఒక్క తెలంగాణా రాష్టంలోనే   పుష్పాలపండగ(బతుకమ్మ)ను  జరుపుకోవడం అంటే మన తెలంగాణా ప్రజలకు ప్రకృతి మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవాలి. బతుకమ్మ పండుగ అంటే   ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ అని, ప్రకృతిని ప్రేమించే గడ్డ మిద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ సోదర భావంతో, ప్రకృతి పై సహృదయ భావాలను పెంచుకొంటూ సమాజంలో అప్తుడువై మేలుగొందుతూ  జీవించాలి. మన బతుకమ్మ పండుగను ఈ మధ్యకాలంలో విదేశాలలో ఉన్న మన తెలంగాణా ఆడపడుచులు గణంగా జరుపుకుంటున్నారు కూడా, ఇప్పుడు మన తెలంగాణా రాష్టం ఏర్పడినందున ఎన్నడు లేని విదంగా ప్రతి ఒక్కరు, దేశ విదెశల్లొఉన్న మన పౌరులు, ఇక్కడున్న మన  మంత్రులు, ఎంపీలు, పోలీసులు, కలెక్టర్లు, అధికారులు ఆడా, మగా తేడా లేకుండా చాలా గొప్పగా నెత్తి మీద బతుకమ్మలతో ఫోటోలు దిగి పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా బతుకమ్మల సందడి కనబడింది. తద్వారా  అంతర్జాతీయ పండుగలాగా చూడముచ్చటగా అనిపించింది.
ప్రతి గ్రామంలో బతుకమ్మలను ఎన్నడు లేని విదంగా చాల బాగా జరుపుకున్నారు ఇక ముందు ఇంక బాగా జరుపుకొని మనము కలలు కంటున్నా  బంగారు తెలంగాణకు అందరు సహకరించాలని కోరుకొంటూ.....


మీ,
కడవెండి సీతారాంపురం. 

మాజీ సర్పంచ్‌ రాంనర్సయ్య కన్నుమూత:

కడవెండి సీతారాంపురం న్యూస్ లైన్ (07/09/14):- సీతారాంపురం మాజీ సర్పంచ్ బస్వ రాంనర్సయ్య కన్నుమూశారు.ఆయన కొంత కాలంగా పచ్చవాతం తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కాలుజారి బాత్రూంలో పడడంతో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ చికిత్య పొందుతూ నిన్న మధ్యాహ్నం తన చివరి శ్వాస విడిచారు. తన రాజకీయ జీవితంలో సుధీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి, గ్రామానికి ప్రధమ సర్పంచ్ గా 1996లో ఎన్నికై చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఆప్తుడు, నిగర్వి,స్నేహశీలి, ముక్కుసూటితనం, మంచితనం గ్రామానికి సేవలందించేలా చేసింది.


గ్రామాభివృద్ధిలో రాం నర్సయ్య


గ్రామంలో మంచి నీటి కోసం అనేక బోర్లను, చేతి పంపులను వేయీంచారువాడ వాడకు నీటిని నిలువచేసే నీటి ట్యాంక్ లను నిర్మించి గ్రామా ప్రజలకు నీటి సమస్య నుండి విముక్తి చేశారు. ఇంటింటికీ నీటి అవసరాన్ని తీర్చడానికి వాడవాడకు నీటి పైపులైను లను వేయీంచి ప్రతి ఇంటికి నాల్లాలను ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఉన్న గ్రామా పంచాయతి,బడిలో ఉన్న కొత్త బిల్డింగ్ ను కూడా వీరే కట్టించారు.పాత మొరిలను, చెరువుల వద్ద, అనేక చెక్డంలు నిర్మించారు.వీరి హయంలో ఓవర్ ట్యాంక్ నిర్మాణం, చాల మందికి ఇందిరమ్మ ఇండ్లు, లేట్రూమ్లు, అనేక ప్రభుత్వ పథకాలు మన గ్రామా ప్రజలకు అందేలా చూశారు..గ్రామా ప్రజల పంచాయతీలు అనేకం పరిష్కరించి, గ్రామానికి పెద్ద దిక్కుగా కొనసాగారు.వారి కష్టసుఖములలో పలు పంచుకునే వారు . ఈయన మరణం గ్రామానికి తీరనిలోటు అని గ్రామస్థులు తెలిపారు. ప్రతి వారితోను స్నేహశిలిగా మెలిగే వారని, గ్రామంలోని ప్రజలందరినీ వరసలతో ప్రేమబిమనలతో పిలిచేవా
రని,చిన్న, పెద్ద తేడాలు లేకుండా ప్రతి వారితో ప్రేమగా మాట్లాడే వారని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. గ్రామానికి పెద్ద దిక్కు కోలుపోయమని గ్రామస్తులు దిర్బంతిని వ్యక్తంచేశారు.


బస్వ రాం నర్సయ్య కుటుంబానికి, గ్రామ ప్రజలకు కడవెండి సీతారాంపురం తరుపున ప్రగాఢ సానుబూతిని తెలియ జేస్తూ,వారి ఆత్మకు శాంతి చేకురాలను కోరుకుంటూ ........
మీ
కడవెండి సీతారాంపురం.

మా ఊరి బోనాలు:

మా ఊరి  బోనాలు:


మా ఊరిలో బోనాల పండగని చాల బాగా జరుపుకొంటాం. ఉదయం పూట కుమ్మరి కులస్థుల వారు పోచమ్మ గుడికి కొత్త సున్నం వేసి గుడి చుట్టూ పక్కల శుభ్రం చేసి అమ్మ వారికీ కొబ్బరికాయ,పూలతో తొలి పూజ చేస్తారు.  ఇక్కడ  పూజారులుగా  కుమ్మరి వారే ఉంటారు.  పోచమ్మ తల్లి  అనుగ్రహం పొందాలని, వారి కుటుంబానికి ఎలాంటి కీడు జరగకూడదని, తల్లి ఈ యేడు సల్లగ జూసి, కాలమై కరువుకాటకాలు దూరం కావాలె అని   అమ్మవారికి కోరుకుంటూ ఉదయం గ్రామప్రజలు ఒకొక్కరుగా పోచమ్మ గుడి వద్ద కోళ్ళు, మేక పోతులూ బలి ఇస్తారు. ఈ బలి ఇచ్చే జంతువు నోటిలో, చెవుల్లో  నీళ్లు పోస్తారు. అది వణుకుతుంది. దీన్ని జడిపించుట అంటారు. జంతువును జడిపిస్తే ఆ జంతువును దేవత ఇష్టపడుతుందన్నమాట.ఇక్కడున్న చాకలి వాళ్ళు ఈ  జంతువు తలనరికి రక్తాన్ని గుడి ముందు ఆరపోస్తారు తరువాత జంతువుకుడి మోకాలు కోసి వేపచెట్టుకు కడుతారు.ఇలా మధ్యాహ్నం సమయం వరకు గ్రామా ప్రజలు వచ్చి వారి కోరికలను కోరుకుంటూ బలి ఇస్తారు.
గ్రామా ప్రజలు వారి ఇంటి వద్ద దేవతకు బలి ఇచ్చిన మేకలను, కోళ్ళను వండుకొని తింటారు. గ్రామా మహిళలు ఒక్కోకరుగా అమ్మవారి దగరికి వెళ్లి తాము ధరించే  వస్త్రాలను అమ్మ దగ్గర పెట్టి పుజిస్తారు. అమ్మవారికి కొత్త బియ్యంతో కొత్త కుండలో బువ్వ  వండుతారు.మన గ్రామంలో మొదటి సరిగా అమ్మకు బోనం పెట్టేది కమ్మరి, వడ్ల, పద్మశాలి కులస్తులవారు( జంజనం ధరించేవారు) పెటిన తర్వాతనే గ్రామా ప్రజలందరూ పెట్టటం  అనవయతిగా వస్తుంది.

 
                          సాయత్రం గ్రామంలోని మహిళలు కొత్త వస్తాలు ధరించి,డప్పుల దరువుల మద్య  బోనాలు తలపై పెట్టుకుని గ్రామంలో గల ప్రధాన విధులగుండా గ్రామా పంచాయతి వద్దనుండి పోచమ్మ గుడికి చేరుకుంటారు. ఈ సారి ఎప్పుడు లేనంతగా చాల బోనాలు మన గ్రామం నుండి బయలుదేరినయీ. సమగ్ర కుటుంబ సర్వే(సర్వే తర్వాత రోజు 20 ఆగష్టు నా బోనాలు జరపడం వల్ల ) కోసం వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం బోనాలు చేయడంతో పోచమ్మ పరవశించింది. అమ్మ వారికీ మొక్కులుగా కల్లు ముంతలు సమర్పిస్తారు. కానీ  హైదరాబాద్లో మదిరిలగా  పోతురాజుల  వేషలు, తొట్టెల తీసుకవెళ్ళడాలు, అమ్మ బండి ముందు తీన్‌మార్‌ అడడలు ఉండవు. అంత ప్రశాంతంగా మహిళలు బోనాలతో అమ్మ వద్దకు చేరుకుంటారు. కొందరు  అమ్మవారి చెంతకు చేరగానే శక్తి ఆవహించి పూనకంతో ఊగిపోతారు.  వీరిని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ తమకు ఉన్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటారు. భక్తులు తమ బాధలను చెప్పుతూ పరిష్కారం అడుగుతారు. శక్తి ఆవహించినప్పుడు వారు చెప్పే మాటలు నిజాలన్ని నమ్ముతారు. దీనిలో బాగంగా  మన గ్రామంలో వర్షాలు పడక పోవడానికి, గ్రామం అబివ్రుద్దిలో వెకన బడటానికి కారణం  అమ్మ వారిని అడుగగా , గ్రామానికి కీడు పట్టుకుందని ఈ కీడు పోవాలంటే బొడ్డురాయి మునిగిందని ఆ  బొడ్డురాయి ని పైకి లేపి పండుగ చేయాలనీ చెప్పింది మరియు శివాలయంలోని గజస్తంబం నిలుపాలని సెలవిచ్చింది.ఇది విన్న బక్తులు అలాగే తల్లి పండుగను చేస్తాం అని చెప్పి శాంతిపజేశాలు.ఇంతలో బేషన్ పట్టుకొచ్చిన కుమ్మరోల్లు, తల్లికి బోనం సమర్పించాడని చెప్పగా తలో పిడుకడు బోనం ని సమర్పించారు. ఈ యేడు సల్లగ జూసి, కాలమై కరువుకాటకాలు దూరం కావాలె మా  ఇంట సిరులు పండాలి తల్లి అని వేడుకొంటు    తిరిగి మళ్ళి మహిళలందరూ బొనలను తలపై ఎత్తుకొని ఇంటికి చేరుకున్నారు  . అమ్మ కు పెట్టిన ఆ బోనం లోని బువ్వను అమృతంలాబావించి కుటుంబ సభ్యులంత కలసి  భుజిస్తారు. ఈ పండుగంత మన  పల్లెజీవన మనుగడకు అర్దం పడుతుంది. 
 మన తెలంగాణా రాష్ట ప్రభుత్వం రాష్ట పండుగగా ప్రకటించింది చాల సంతోషం. మన సంస్కృతి, సంప్రదాయాలను మన ముందు తరాల వారికీ తెలియజేయడం  మన బాద్యత. కానీ నిదులను అందించడంలో  మాత్రం వేనుకాడింది. వచ్చే సంవత్సరం ఐన అందిస్తుంది అని ఆశిస్తున్నాము.
*మన గ్రామా సర్పంచ్ గా ఎనికల్లో గెలుస్తే మల్లేష్ గారు పోచమ్మ కి గుడి కడుతానని  చెప్పారు కానీ  ఇంత వరకు ఎలాంటి పనులుగానీ, కనీసం మాటలుగాని మాట్లాడటం లేదు.* మన తెలంగాణా ప్రభుత్వం ప్రతి గ్రామంలో బోనాలు జరుపుకోవడానికి నిదులతో పాటు, గుడి కట్టించడానికి నిదులను విడుదల చేయాలి అని కోరుకుంటూన్నాను.



సదా పోచమ్మ దీవెనలు మీ కుటుంబం పై ఉండాలని కోరుకుంటూ....


మీ,

కడవెండి సీతారాంపురం.










దొడ్డి కొమురయ్య(doddi komuraiah)

దొడ్డి కొమురయ్య 68వ వర్దంతి (జూలై 4,2014) సందర్బంగా ....


భూమికోసం, భుక్తికోసం, శాంతియుతంగా సభలు సమావేశాల ద్వారా చేస్తున్న పోరాటాన్ని సాయుధ మార్గం లో నడిచినది మన దొడ్డి కొమురయ్య అమరత్వమే.

తెలంగాణ గడ్డపై రజాకారుల తుపాకి తూటాలకు మొట్ట మొదటి సారిగా దొడ్డి కొమురయ్య బలెైనాడు.

సభలు, సమావేశాల ద్వారా, శాంతి వచనాల ద్వారా భూస్వాములు దారికి రారని ప్రజలు తెలుసుకున్నరు. ప్రభుత్వం, అధికారులు , దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లకు తొత్తులేనని అర్థం చేసుకున్నరు.ఈ చైతన్యంతోనే.. ఆంధ్రమహాసభలోని అతివాదులు కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడి సాయుధ పోరాటాన్ని నడిపిండ్రు. ఈ సాయుధ పోరాటానికి నాంది పలికింది మన కడవెండి ముద్దు బిడ్డ కొమురన్న అమరత్వమే.

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుడు,

తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదని వీరుడు,

నేటి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన గణుడు,

నాటి తెలంగాణా ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన విప్లవ వీరుడు.

ప్రజలనుండి వచ్చిన ప్రజల మనిషి,

పోరాటం ఒక అనివార్యంమైంది మన దొడ్డి కొమురన్నకి.

కడవెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వం (1946 జూలై 4) తర్వా త కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో ప్రజా ప్రతిఘటన సాయుధ పోరాట రూపం తీసుకుంది. రైతు కూలీలు, మహిళలు వీరోచితంగా, సాయుధం గా పోరాడారు. పల్లెల నుంచి భూస్వాములు మూటా ముల్లె సర్దుకుని పట్ణణాలకి పారిపోయారు. ఇందరు త్యాగధనుల పోరాట ఫలితంగా కొన్నివేల గ్రామాలు విముక్తమయ్యాయి. కొన్ని లక్షల ఎకరాలు ప్రజలకి పంచారు.

ఇదంతా తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు మన దొడ్డి కొమురన్న అమరత్వంతో వచ్చిన విప్లవం మూలంగానే జరిగిందన్నది తెలంగాణా చారిత్రక వాస్తవం.

దొడ్డికొమురయ్య స్పూర్తితో తెలంగాణా ప్రజలు ప్రతేక తెలంగాణ రాష్ట ఉద్యమంలో పాల్గొని తెలంగాణాను సాదించుకొన్నారు.

ఇదంతా బాగానే ఉంది కాని...

తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా రాజకరులను ఎదిరించిన మన కొమురన్నకు తగిన గుర్తిపు దక్కిందా..?

మన తెలంగాణా చరిత్రను కనుమరుగు చేసి,

నేటి తెలంగాణా సమాజానికి చరిత్రను వేత్తుకొనే పరిస్థితికి తీసుకొచ్చిన

ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణా అన్ని విదాలుగా నష్టపోయింది.

తెలంగాణాలోని మేధావులందరూ తెలంగాణా చరిత్రను, మన అస్తిత్వాన్ని

మన ముందు తరాలకు తెలియజేయాలి.

దీనిలో బాగంగా తెలంగాణా ప్రభుత్వం ఈ విదంగా చేయాలి

** తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం చరిత్ర , దొడ్డి కొమురయ్య అమరత్వంతో వచ్చిన పరిణామాల గురించి స్కూల్ బుక్స్ లో పొందుపరచాలి.

** జనగాం ప్రాంతాన్ని జిల్లాగా గుర్తించి దొడ్డి కొమురయ్య జిల్లాగా నామకరణం చేయాలి.

**దొడ్డి కొమురయ్య అమరుడైన జూలై 4 నా " తెలంగాణా అమరవీరుల" రోజుగా గుర్తించి గవర్నమెంట్ హాలిడే ప్రకటించాలి.

**దొడ్డి కొమురయ్య ఫోటోతో కూడిన రెవెన్యు స్టంప్స్ ను విడుదల చేయాలి.

**నాటి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణా రాష్ట ఆవిర్భావం వరకు జరిగిన పోరాట చరిత్ర తెలిసే విదంగా స్ముతికేంద్రాన్ని నిర్మించాలి.

** ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణా పోరాట అమరుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి.


అమరహే దొడ్డి కొమురన్న .... అమరహే

అమరహే దొడ్డి కొమురన్న .... అమరహే


మీ,
కడవెండి సీతారాంపురం.

అమ్మమ్మ, నాన్నమ్మ లకు వందనాలు!!



మా నాన్నమ్మ నన్ను ఎత్తుకొని ఆడించలేదు, లాలించలేదు, బుజ్జగించలేదు, నా తప్పటడుగులను సరిచేయ్యలేదు, గోరుముద్దలు తినిపించలేదు, గోరేచ్చని నీటితో తానం చేఎంచలేదు. ఎత్తుకొని నా చిన్ని బుగ్గల మీద చిన్నగా ముద్దు పెట్టలేదు, పండుగనాడు పిండివంటలు వండి తినిపియ్యలేదు కొత్త బట్టలు కొనియ్యలేదు, బడికి వెళ్తుతున్నపుడు కొంగుముడి విప్పి అద్ద రూపాయో... రూపాయో నాకివ్వలేదు, నేను ఎదుగుతుంటే చూసి సంతోషంతో నా బంగారుకొండ అనుకుంటూ తన వేళ్ళతో నా తలను నుమరలేదు, నేను అల్లరిచేస్తే కోపగించలేదు, తప్పులూ చేస్తే మందలించలేదు, తాత నన్ను కొడుతుంటే నిలువరించలేదు, నాన్న నన్ను కోప్పడితే వెనకేసుకరలేదు, అమ్మ నాపై చిర్రుబుర్రులడినప్పుడు చిన్నగా చిరునవ్వు నవ్వలేదు, అక్క తో కలసి స్కూల్ కి వెళుతుంటే టాటాలు.... బాయ్బాయ్ లు చెప్పలేదు.
ఎందుకు నాయనమ్మ నీ మనవడంటే నీకంత కోపం! నేను పుట్టేవరకు ఎందుకమ్మా నువ్వు ఆగలేదు, నీ మనవడిని ఎత్తుకు తిరగాలని నీకెప్పుడు అన్పించలేదా.. నీ మనవడి సేవలో కంటే నీకా స్వర్గంలోనే ఆనందం దొరుకుతుందనుకున్నావా..నీ మనవడిని చూడకుండానే స్వర్గంలో స్థిరపడిపోయావా..నీ మనవడు నిన్ను చుదోద్దనుకున్నావా.. నీతో అడుకోవద్దనుకున్నావా.. నీ ఫోటోని చూసుకుంటూ హృదయం ద్రవించేలగా కండ్లు తడిసి ముద్దయేలాగా ఎన్నిసార్లు .. నాన్నమ్మ .. నాన్నమ్మ.... అనుకుంటూ నిద్రలో ఉలిక్కిపడిలేశానో.. నాన్నమ్మఈ జన్మలో నేను నీ ప్రేమకు నోచుకోలేదు. మరు జన్మంటువుంటే నేను నీ మనవడిగానే పుట్టి నీ ప్రేమాభిమానాలను పొందాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.


మా అమ్మమ్మ నాకు ఊహావచ్చేంతవరకు నాతో కలసి అడుకుంది, నాకు గోరుముద్దలను తినిపించింది. ప్రేమతో ఆర్రలో దాచిన లాడ్డులను, పాలమిగడను నోటిలో పెట్టి తినరా నా.. బంగారు కొండకదు తినవయ్య.. ఇంకొంచం తిను అనుకుంటూ తినిపించేది. పండగొచ్చిందంటే మా అమ్మమ్మ ఊరికేల్లుతున్ననని చాల సంతోషంగా మా ఫ్రెండ్స్ కి చెప్పేవాడిని. నా 7వ ఏట మా అమ్మమ్మ నన్ను విడిచి వెళ్ళింది. దీనితో నేను అమ్మమ్మ ప్రేమకు కూడా నోచుకోలేదు.

మా తాతా (నానమ్మ తాతా) ప్రేమలో పెరిగి పెద్దయ్యను.

నేను ఇంటర్మీడియట్ చదువుతున్నపుడు
 మా తాత నన్ను  విడిచి వెళ్ళాడు.తాత అనే పిలుపుకు నన్ను దూరం చేశాడు.
 తాత ప్రేమను పుడ్చాలేనిది. తాత నివు చెప్పిన బాటలోని నడుస్తా..
 మరో జన్మంటువుంటే నీకు మనవడిగానే పుట్టాలని ఆ దేవుడిని వేడుకొంటున్న.
  కాని ఎవరైనా నానమ్మ వారస ఉన్న వారిని ప్రేమతో నిండు మనసుతో నానమ్మ అన్ని పిలుస్తాను. 
నానమ్మల వర్సలో కంటే అమ్మమ్మ వరసలో
 నాకు ఎక్కువ మంది ఉన్నారు వారి అందరిలో మా అమ్మమ్మను చూసుకుంటాను.
అమ్మమ్మ, నాయనమ్మల ప్రేమలను తెలియకుండా నా అంతల నేను మాములుగానే బ్రతుకుతున్ననే, మరి ఎందుకు అమ్మమ్మ, నాయనమ్మ రాత్రి నా కలలోకొచ్చి నా కిష్టమైన లడ్డులను చేసి తినిపిచారు. నన్ను మీఎదలో నిధ్రపుచ్చారు, అందరికి నా మనవాడని చెప్పుకొని తిరిగారు, మీ మనవడికి పెళ్లి సంబంధం కూడా చూశారు, అంతలోనే ఎందుకు మాయమైనారు.
నిజంగా మా అమ్మమ్మ, నాయనమ్మలు నా కలలో కొచ్చారు. "మన దగ్గరుంటే వారి విలువ మనకు తెలియదు, అదే మనకు దూరమైతే వారి విలువ తెలుస్తుంది " అనే సామెత నిజంగా వాస్తవం.
మీకు అమ్మమ్మ, నానమ్మలు ఉంటె వారిని ప్రేమతో పలకరించండి! వారితో కొంచం సమయాన్ని కేటాఎంచండి! వృద్దులు చిన్న పిల్లలతో సమానం కావున పండగకో, ఫంక్షన్ లకో ఇంటి కి వెళ్ళితే వారికి ఇష్టమైన వాటిని తిసుకపొండి, ప్రేమతో తినిపియ్యండి. వారి ప్రేమను పొందండి.


ఓపికతో చదివినందుకు ధన్యవాదాలు!!

మల్లోక్కసారి మా అమ్మమ్మ, నాయనమ్మ,తాతను  తలుచుకుంటూ.....


మనవడి ఆవేదన.

24th November, 2013.

రైతు.. రాజా?


రైతన్నలు మన ఆకలిని తీర్చడం లేదా....?
మన ఆకలిని తీర్చే రైతన్నలు మనకు ముఖ్యం కాదా....?
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు
 మనం తినే ప్రతి పదార్దం రైతుల కష్టం కదా..?
బియ్యానికి,పప్పులకు,బెల్లా నికి,చక్కెరకు.వంటనూనెలు ,కూరగాయలు,ఉల్లిపాయలు,తెల్లగడ్డ లు మొ!!వి 
 వీటికి అన్నింటికి మనం చెల్లించే ధరలు ఎంత...?
మనం చెల్లించే ధరల్లో రైతులకు దక్కుతున్నది ఎంత..?
రైతాంగం చితికి పోతున్నది.
బక్క చిక్కి పోతున్నది.
నష్టాలు వచ్చి అప్పుల పాలై పంటలు పండించడం మానేస్తున్నది.
అందరూ అదే పని చేస్తే మనందరి పరిస్తితి ఏమిటి..?
మనము మన కుటుంబాలు,మన ముందు తరం పరిస్తితి ఏమిటి?
రైతు రాజు అయినపుడు రైతులకు అప్పులేందుకు ..?
రైతులకు ప్రతి పంటకు రుణ సౌకర్యం అవసరం ఎందుకు..?
రైతులు అప్పులలో పుట్టి అప్పులలో పెరిగి ,అప్పులతో ఎందుకు చని పోవాలి?
ఎందుకు ఆత్మ హత్యలకు పాల్పడాలి.?


వోటు కోసం రైతు రుణాలను మాఫీ చేస్తానన్న కెసిఆర్,
నేడు రైతు రుణాలపై షరతులు పెట్టడం ఎంతవరకు సమంజసం...?
మేము ప్రజా ఉద్యమాలనుండి వచ్చాము మాకు రైతుల కష్టాలు తెలుసు
అన్న కెసిఆర్ గారు నేడు రైతుల రుణమాఫీ గురించి తీసుకుంటున్న నమ్మక ద్రోహాన్ని నేను జిర్నిచుకోలేకపోతున్న.

మీరు రైతుల రుణమాఫీ గనుక చేయకపోతే మేము ఉరి వేసుకునే ( రైతులు ఆత్మహ్యలు )
పరిస్థితి వస్తుంది కెసిఆర్ గారు.
ఈ ఆత్మహ్యలకు బాద్యత నిదే.
నమ్మించి   మోసం చేస్తున్నావు గాదరా..?
నివు రైతులకు చేసే ఈ మోసం తెలంగాణా చరిత్ర కె మచ్చగా మిగిలిపోతుంది.
ఐన నేను ఊరుకోను పోరాడుతా...
పాలకులను నిలదిస్తా..
నాకు సజ్జమైంది నేను చేస్తా...
ఫ్రెండ్స్ మీరుకూడా ఈ నమ్మక ద్రోహాని తిప్పికొట్టాలి.
రైతులకు అండగా నిలువాలని కోరుతూ...

మీ
కడవెండి సీతారాంపురం.

5th June,2014.

ఇది నా సమాజమా ?


డబ్బులేని వాణ్ణి , మనిషిగా చూడని నా సమాజమా..

భిదవాని ఆత్మాభిమానాన్ని కాలరాసే నా సమాజమా..

నిరుద్యోగిని హేళన చేసే నా సమాజమా..

చిరుద్యోగిని చిన్నచుపుచుసే నా సమాజమా..
వృద్ధులను బిచ్చగాళ్ళను చేసే నా సమాజమా..
దేశ సంప్రదాయాలను అపవిత్రం చేసే నా సమాజమా...
స్త్రీజాతిని అవమానించే నా సమాజమా..
పేదవానిచెమటచుక్కనుఅత్తరుగాజల్లుకునేరాజకీయమాఇదినాసమాజమా..?

విదేశీ పెట్టుబడులకు అమ్ముడు పోయేన నా భారతమా ఇది నా సమాజమా..?
కుక్కలకున్న విలువ తోటి మనిషి పై లేకున్నదే నా సమాజమా..
రైతు రాజైతే రాజు ఆత్మహత్యాలెందుకే నా సమాజమా..
పేద వాణి బ్రతుకు బారమై, ఐశ్వర్య వంతులకు విలసమయేనే నా సమాజమా
ప్రాణం కన్నా డబ్బే మిన్నంటున్న నా సమాజమా..
మనవ సంబందాలు మంటగాలేపేనేడు నా సమాజమా..
పేదవానికి చిరిగినా గుడ్డ, ఉన్నోనికి చింపిన గుడ్డ నా సమాజమా..

ప్రస్తుత రోజులలో ఆదునిక ప్రపంచంలో సాధిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చూసి

 ఆనందించాలో లేక రోజు రోజుకు దిగజారుతున్న నైతిక విలువలు చూసి 

బాదపపడలో తెలియని స్థితి నాసమాజానిది.
మనిషి మానవత్వావిలువలను కాలరాసి వ్యక్తిపై ఉండే నమ్మకం కంటే 

డబ్బుపై ఉండే నమ్మకం( ప్రేమ) ఎక్కువై, ఆధునిక సుఖలోగిలిలో బానిసై ,

 స్వార్దంతో, కక్ష్యతో, దోపిడిలతో, రాక్షశానందలతో , కామామధవాత్స కోరికలతో 

నేటి మానవత్వ విలువలనుమంటగలిపి డబ్బుకై పరిగెడుతున్న నా సమాజమా...

ఎటు పోతున్నాం మనం...?

అవసరానికి మించి డబ్బు అవసరమా ..?

మానవతసంబందలకంటే మనీసంబందలే గొప్పవా?

సంపాదించడం తప్పుకాదు ఆ క్రమంలో

చుట్టూ ఉన్నవారిని వదేలేసుకోవడం తప్పు కదా..?

మనవ విలువలను లెక్కచేయకుండా సంపాదించినా డబ్బు చిరకాలం నీతో ఉంటుందా ..?


ఒకడు విజయం సాదించాడంటే మిత్రుల, శేయోబిలషుల చేయూత అవసరం
కనుక మీ మిత్రులకు మీ సమర్దతకు తగ్గటుగా సహాయ పడి, మానవత విలువలను కాపాడండి.
నాటి భారతాన్ని నేటి ప్రపంచానికి చాటి చెప్పలేమా?
ఆలోచించండి మిత్రులారా..!!

 
మీ
కడవెండి సీతారాంపురం.

బాల్యస్మృతులు :


ప్రతి ఆటలో గెలుపు కోసం పోరాటమే..

ఓడిపోతే ఉక్రోషామే ..

తొండాటలు..

తగువులు...

అలకలు....

మూతి బిగించుకోవటాలు..

ఇవన్నీ చెయ్యని పిల్లలు ఉంటారా?


నాకు తెలిసిన కొన్ని ఆటలు..
మీ కోసం...


1)కర్ర బిళ్ళ,2) చెరువులో ఈతలు, 3)కోతి కొమ్మచ్చి,4)వైకుంఠపాళి, 5)వామనగుంటలు,

6) చింతగింజలాటలు,7) తొక్కుడుబిళ్ళ, 8)బంక మట్టి బొమ్మలు,9) కబడ్డీ,10) కోకో, 11)కోలాటాలు,12)కళ్ళగ్గంతలు,13)ఇసకలో ఇల్లు కట్టుకొనే ఆట,14)బొంగరాలు,15)ఉయ్యాల ఊగడం,16)తాడాట(స్కిప్పింగ్),17)పులి మేక, 18)గవ్వలు, 19)కాగితాలతో విమానం తయారు చేయడం 

20)రింగు ఆట 21)చుక్ చుక్ రైలు 22) వంగుడు దూకుడు 23)చుక్కల ఆట 24) పదాలు వెతుకుట 

25)కాగితంతో పడవల్లాంటి ఆకారాలు 26)కాగితాలతో తుపాకి తయారు చేయడం 27)దారం తో చిక్కుముళ్ళ ఆట,28)సినిమాలు ప్రదర్శన 29)కొబ్బరి ఈనేలు పైకి పంపే ఆట,30)అగ్గి పెట్టేల సేకరణ 31)గాలిఫటాలు,

32)కూల్ డ్రింకు మూతకు హోల్స్ వేసి దానిలో దారము పెట్టి ఆడే ఆట, 33) పత్తాలాట 34) అంతక్షరి 35)క్రికెట్,36)చదరంగము,37) అన్నంకూర ఆట 38) మొగుడు పెళ్ళాం 39) రాయి రంగాన్న - పెండల బుర్రి 

40) చేతులతో చేపలను కడిగే ఆట 41) పైసలాట,42) ఉప్పు రాళ్ల ఆట

ఇలా చెప్పుకుంటూపోతే చాల ఆటలున్నవి. నాకు తెలిసిన కొన్ని ఆటలను మాత్రమే పరిచయం చేశాను. కొన్ని మరచీపోయి ఉండచ్చు.. మీకు తెలిసిన ఆటలను పరిచయం చేయండి.

మీ,
కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


6.గోలీలాట:


గ్రామాలల్లో పెరిగిన ప్రతి ఒక్కరు ఈ ఆటను ఆడే ఉంటారు.
చిన్ననాటి ఆటల్లో ఆతి ముఖ్యమైన ఆటగా ఈ గోలీలాటను చేపుకోవచ్చును.
ఈ గోలిలతో ఆనేక మైన ఆటలను ఆడుకోవచ్చును.
గచ్చు, బద్దిలాట, రౌండ్ గా గోలీలను జల్లి మల్లి ఒక గోలితో కొట్టాలి, రౌండ్ ఆవతల పడితే మొత్తం గోలిలన్ని మనకే ఇలా ఎన్నో ఆటలను ఆడుకోవచును. మేమైతే గ్రామా పంచాయతి ముందు సుమారుగా 100కు పైగా గోలీలను గచ్చులొ పెట్టి ఆడేటోల్లం.
బడి బయట స్నేహింతులతో విరామ సమయంలో ఆడేటోల్లం. బావి దగ్గర పశువులను మేపుతూ కూడా ఆడేటోల్లం.ఈ గోలిలన్ని మా గోశాల దగ్గర & ఇంటి వెనుకల భూమిలో గోతి తిసి మరి దశేటోన్ని ,ఇలా ఎక్కడ గోలీలను దశింది గుత్తులేకుండేది. మొన్న ఉగాది రోజున ఇంటి వెనకాల కనకంబ్ర చెట్టును పెడుతుంటే 38 గోలీలు దొరికినవి.
ఎంత థ్రిల్లింగ అన్పించిదో... చెప్పడానికి ఆక్షరాలు దొరకడం లేదు.

ఇట్లు
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


5. దాడి ఆట :


ఈ ఆట మెదడుకు పని చెప్పుతుంది.
ఆలోచన శక్తిని పెంచుతుంది.
ఎదుగుతున్న పిల్లలలో జ్ఞానసంవృద్దిని పెంచుతూ,
జీవితం మీద గుండెల్లో విశ్వాసంని నింపుతుంది .

ఈ ఆటలో ఇద్దరు ఆటగాళ్ళు వుంటారు.
ఒక్కొక్కరికి తొమ్మిది తొమ్మిది చొప్పున చింత గింజలు/ రాళ్ళూ /కట్టే పుల్లలు
ఏవో ఒకటి ఎవరి వస్తువులు ఎవరిదో గుర్తుపట్టడానికి వేరు వేరుగా తీసుకోవాలి. కింది బొమ్మలో ఎరుపు రంగు సున్నాలలో ఒకరి తరువాత ఒకరు తమ పావుల్ని(వస్తువులు) పెట్టాలి. అడ్డంగాకాని, నిలువుగా కాని, క్రాస్‌గా కాని మూడూ ఒకే రకం పావులు వస్తే ఒక దాడి జరిగినట్లు.
దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి పావుల నుంచి దాడికని పావును తీసుకుంటారు.

ఇలా తొమ్మిది పావులు పేర్చడం అయ్యాక పావులకు కదలిక వస్తుంది. ఒక కూడలి నుంచి మరో కూడలికి కదలొచ్చు. మళ్ళీ మూడూ ఒక వరుసలోకి చేరగానే అవతలి వాడి పావుని తీసుకోవచ్చు. ఒకసారి దాడి జరిపిన పావును , ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి పావులన్ని పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును.

ఈ ఆటతో పాటు
ముడురాళ్ళ దాడి ఆట కూడా ఆడుకోవచును.
పైన తిలిపిన ఆటలాగే ఈ ఆట ను ఆడుతారు కాకపోతే ఈ ఆట లో మూడు పావులు మాత్రమే ఉంటై.
ఈ ఆటను ఎక్కువగా బావి దగ్గర పశువులను మేపుతూ ఆడుకోనే టోల్లం.
చాలెంజ్ గా తీసుకోని చాల సీరియస్ గా ఆడేవాళ్ళం.
అపుడప్పుడు పైసలుకుడా బెట్టు పెట్టుకోనే టోల్లం.
టైంపాస్ కి ,మేధాశక్తికి ఈ ఆట ఎంతో ఉపయోగంసుమా..

ధన్యవాదాలు మిత్రుల్లారా !!

ఇట్లు
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


4.అష్టా చేమ్మా


అమ్మలక్కలందరికి బాగా తెలిసిన,
ఆడిన ఆట ఈ అష్టా చేమ్మాఆట ..
వాళ్ళే కాదు మనంకూడా ఆడామనుకో..
ఈ అష్టా చేమ్మా ఆటలో నలుగురు అడవచ్చును.
ఈ నలుగురు వారివారి ఆట వస్తువులుగా చిన్న చిన్న రాళ్ళూ ,
చీపురు పుల్లల్, చింతగింజలు, వడ్లగింజలు మొ!!వి.
పెట్టుకొని ఇంట్లోని బండలపై గాని, విదిబయటి అరుగులపై గాని గిసిన
అష్టా చేమ్మా పటముపై పెట్టి , సగబాగము
అరగ దీసిన నాలుగు చింత గింజలను వెదజల్లగ..
ఒకటి తెల్లగా పడితే కన్ను అని ..
రెండు తెల్లగా పడితే దుగా అని ..
మూడు పడితే ( గుర్తుకు రావడం లేదు) అని..
నలుగు తెల్లగా పడితే చెమ్మ అని..
నలుగు నలుపు పడితే అష్టా అని...
ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఆటను ఆడుకుంటారు.
మా ఇంట్లో 14 సం!!. క్రింద రంగులతో వేసిన అష్టా చేమ్మా
ఇప్పటికి ఉంది. ఇప్పుడైతే పిల్లలెవరు ఆడటంలేదు కాని..
అప్పట్లో దీనికి (అష్టా చేమ్మాకి) చాల గిరాకి ఉండేటిది...
ఏ పని తోయక హైరానా పడే వారిని చూసి
అష్టా చేమ్మా ఆడుతున్నవురా....? అని హేళనతో
తెలుగులో శాత్రం కూడా పుట్టింది మరి.
ఇది మన తెలుగు ప్రజల ఆట..
అష్టాచేమ్మాట...

ఇట్లు,
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


3.వీరీవీరీ గుమ్మడిపండు :


గుర్తుందా సోదరా.. మీ ఇంటిముందు
సాయంత్రా సమయాన సేదతిరుతున్నా అ క్షణమున
మీకు మీ అమ్మో, అక్కో, తాతాయో, నానమ్మో..
ఎవరో ఒకరు వారి వల్లో కూర్చోబెటుకొని
మీ కళ్ళును మూస్తూ... మిగతా పిల్లలంతా ఎదురుగా నుంచోబెట్టి
'వీరీవీరీ గుమ్మడి పండూ.... వీరి పేరేమి...?'
అంటూ రాగయుక్తంగా ఆడిగిన ఆ క్షణం గుర్తుందా ....?
చేతుల్ని తాకిచూసి వాళ్ళెవరో గుర్తుపట్టాలన్నమాట....!
అలా గుర్తుపట్టలేకపోతే ఓడిపోయినట్లు.....!
కాదుకాదు..... ఆతను కదేకాదు అంటూ
మిగిలిన పిల్లలంతా గేలి చేస్తారు....!
చెప్పలేకపోయిన కుర్రాడు చిన్నబుచ్చు కుంటాడు....!
మిగతా పిల్లలంతా కిలకిలా నవ్వేస్తారు...!
తల్లి ముసి ముసిగా నవ్వుతూ... మురిసిపోతుంది...!
తెలుగునాట వెల్లివిరిసిన ఆనందపు సయ్యాట....!
పసి(డి) మనసులు పరవశులై పురివిప్పి ఆడే సంబరాల పాట....!
మరపురాని మధురాను భూతి...!
ఇదంతా ఎప్పటిదో చిన్ననాటి ముచ్చట...!

'వీరీవీరీ గుమ్మడి పండూ.... కామెంట్ రాసేద్దేవరు ...?'

ఇట్లు,
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


2.తాటికాయ బండ్లు :


ఈ తాటికాయ బండిని తాయారు చేయడానికి దేవరుప్పుల దగ్గరి వాగుకాడికి పోయే టోల్లం పెద్ద పెద్ద తాటికాయ(ముంజలు)లను తెచ్చి ఈ క్రింది విదంగా తాయారు చేసిటోల్లం.
రెండు తాటి కాయలను తీసుకొని తాటికాయమద్యలో పదునైన కర్ర ముక్కను తొడిగించి , చివరన రెండు పంగలు కలిగిన పొడవాటి కర్రను తీసుకొని , తాటి కాయ మద్యలో తొడిగించిన, చిన్నకర్ర ముక్క మద్యలో పటంలో చూపినట్లు పెట్టాలి. ఇప్పుడు తాటికాయ బండి తయారైంది.

ఈ బండ్లతోటి ఊర్లోని విధుల వెంబటి తిరిగేటోల్లం,
నా బండి గట్టి దంటే, నా బండి గట్టిదని రెండు బండ్లను గుద్దేటోల్లం,
పచ్చిగా బలంగా ఉన్న తాటికాయ బండ్లు,ఈ ఎండలకు బక్కచిక్కి పోయేవి..
మల్లి కొత్త బండిని తాయారు చేసుకోనేటోల్లం..
ఆ రోజులే వేరప్ప...........

మీ
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


1.సైకిల్ టైరు ఆట:


సైకిల్ టైరు..
రిములతో పరుగు..
తెలియకుండానే ప్రక్రతితో చెలిమీ...
ఇంటి దగ్గరనుంచి బడి దగ్గరికి...
బడి దగ్గరి నుంచి బావికాడికి...
ఇలా సైకిల్ టైరు ముందు, నేను వెనుకాల...
ఊరు మొత్తం ఒకటే పరుగులు....
అమ్మ ఆరుపులు...
నాన్న పరుగులు..
నన్ను ఆపేవాళ్ళు ఎవరు...?
ప్రక్రతి వడిలో నా బాల్యం...
చూస్తుండగానే గడిచేను మదురానుభవం...

ఇట్లు,
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


ఎండాకాలం వచ్చింది... సెలవులెన్నో తెచ్చింది...

వేసవి సెలవులు పిల్లల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతాయి. ఆటలు, పాటలు, విహారాలు వారి మనోవికాసానికి బాటలు వేస్తాయి. ఏడాది అంతా పుస్తకాల మోతలు, హోంవర్కులు, మార్కులు సాధనతో విసిగిపోయిన పిల్లలకు ఆటవిడుపుగా మరుతునై. కొత్త ప్రదేశాలు, నూతన స్నేహాలు, ఆసక్తి నింపే అంశాలు వారిలో కొత్త కాంతులు నింపుతాయి. శరీరారోగ్యానికి ముఖ్యమైనవి ఆటలు.
మనకు ఆటలు అనగానే చిన్నప్పటి రోజులే గుర్తుకు వస్తుంటయీ..!
ఈ ఆటలు మానసిక వ్యాయామానికి,నాయకత్వలక్షణాలకు,ఒక పని ఎలా చేయాలి దానికి కావలసిన ఓపిక ఇలా ఎన్నో నేర్పుతుంది అనే చెప్పాలి.
మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలను మన పిల్లలు ఆడుకునేలా పరిస్తితులు కల్పిస్తున్నమా..? ఈ వెసని సెలవులను పూర్తిగా పిల్లల ఇష్టనికి వదిలేద్దాం.
మనం కూడా మన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుందాం. మనం మన చిన్ననాటి ఆటలు, అల్లర్లను ఈ వేసవి రోజుల్లో నేమరేసుకుందాం!!

మన అందరికోసం "కడవెండి సీతారాంపురం" ఈ వేసవి కాలం ఒక కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ కార్యక్రమం పేరు '' నా జ్జాపకాలు ". ఈ కార్యక్రమంలో మనం/నేను ఆడిన ఆటలను గుర్తుచేయడం దీని ఉదేశ్యం. మీ చిన్ననాటి జ్జాపకాలు మాతో పంచుకోండి..!! మన సంస్కృతి,సాంప్రదాయతో ముడిపడిన మన బాల్యాన్ని రాబోవు ఆదునిక యంత్ర ప్రపంచానికి అదించండి.
మీరు మాకు సూచనలు, సలహాలు పంపించాలని అనిపిస్తే kadavendisitharampuram@gmail.com మెయిల్ కి సెండ్ చేయగలరు.

ఇట్లు,
కడవెండి సీతారాంపురం.

నిజాయతిగల ప్రజా నాయకులు కావాలి .


రాజకీయం చేసి నాయకులూ మాకొద్దు, నిజాయతి గల ప్రజా నాయకులు కావాలి .
అధికారం కోసం వచ్చే నాయకులు మాకొద్దు, సేవచేసే నాయకులూ కావాలి.
కోట్లను మింగే తిమింగలాలుమాకొద్దు, మా ధనాన్ని కాపాడే కాపలా....... కావాలి.
అదికరంతో రాజదానిలో ఉండే వాళ్ళు మాకొద్దు, మా వెంటే ఉండే జీతగాళ్ళు కావాలి.

"రైతే రాజు" , రైతు ప్రభుతం మాది అంటారు, మరి రైతుల ఆత్మహత్య లెందుకు?
మీ పిల్లలకు ఇంగ్లీష్ స్కూల్స్ , ఇంటర్నేషనల్ విద్య, మా పిల్లలకు గవెర్నమెంట్ స్కూల్స్, ఉపాది విద్య.
మా డబ్బులతో మాకు పనిచేయమంటే, మీ డబ్బులగా బ్యాంకులలో దాచుడేలా?
ఎన్నికల సమయంలోనే నివు, మాకు జీతగాడివాని గుర్తోచిందా?
ఒకడు చిపిరిబట్టి రోడ్డుకుతున్నాడు , మరొక్కడు బట్టలుతుకుతున్నాడు
డప్పుకోడుతడు , చిందులేస్తాడు, వంటోన్డుతడు, పాలు పితుకుతడు..
ఇలా ఎన్నో పిచ్చిపనులన్ని చేస్తారు .
ఎన్నికలైపోతే వాణ్ణి చూడానికి కండ్లు కయలుకయలె, గంటలకొద్దీ వెట్ చేయాలి.
ఇచ్చిన హమిలన్ని గుర్తు చేసిన విని, వినిపించానట్లే వెళ్ళిపోతాడు. ఇది మన నాయకుల తీరు...

సో ఫ్రెండ్స్ దయచేసి మీరు అలోచినండి. మన వియోజకవర్గంలో ఎవరైతే ఎల్లపుడు ప్రజలతో ఉండి , ప్రజా సమస్యలను తెలుసుకొని, జవాబుదారిగా ఉండే నాయకుడినే ఎన్నుకోండి. పార్టీలన్నీ పక్కన పెట్టండి . వక్తిని చూసి మీ ఓటుని వేయండి.

మీ
కడవెండి సీతారాంపురం.

మారని బ్రతుకులు

రాష్ట్రలలో, దేశంలో ప్రభుత్వలు, నాయకులూ మారుతున్నా..
గ్రామ ప్రజల జివితాలల్లో మాత్రం మార్పు అంతంత మాత్రంగానే ఉంది.
దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలూ,
" రైతే రాజు" అన్న ప్రభుత్వలు,
నీచమైన రాజకీయాలకు...
బలిఅవుతున్న రైతన్నల కష్టలు
ఎవరికీ కన్పించవు? రైతు అప్పుల బాధ తో ఆత్మహత్య చేసుకుంటే ,
శవరాజకియలకు కూడా వెనుకాడని నీచాతి నీచమైన రాజకీయాలకు పునాదులపై రాజకీయ భవనాలు కడుతున్నారు.
చావలేక, బ్రతకలేక , మధ్యతరగతి, ఆర్దిక ఇబ్బందులలో రైతులు తమ జీవితాలను నేట్టుకోస్తుంటే... వచ్చిరాని హామీలతో , మసిపూసి మారేడుకాయని చేసి అధికారం అందుకోవాలనుకుంటునవే! నిత్యావసరాల దరలు ఆకాశానికి తాకుతుంటే ,రూపాయీ పతనమై దరలన్ని పెరుగుతుంటే , రైతన్నల చెమట చుక్కలతో పండించిన పంటలకేండుకురా దరలు పెంచారు? ఏ ముఖం పెట్టుకొని వచ్చారురా?
అన్నదమ్ములగా కలిసుండే గ్రామా ప్రజల మద్య చిచ్చు పెట్టరెందుకురా? ఇరుగు పొరుగు వాళ్ళను శత్రువులను చేశావుగాదరా? కులాల మద్య , మతాల మద్య విద్వేషాలను రెచ్చ గోట్టరుగాదరా? మీ అధికారం కోసం దేశామేమైన పరవాలేదు అన్నట్లు ప్రవర్తిస్తునారేందుకు ?

కడవెండి సీతారాంపురం.

సీతారాంపురం గ్రామ సమస్యలు

బారత దేశం లో ఒకానొక చిన్న మారుమూల గ్రామం కడవెండి సీతారాంపురం.
గ్రామాలూ అబివృద్ది చెందుతే దేశం అబివృద్ది చెందినట్టు అంటారే ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నట్టే మా గ్రామంలో కూడా సమస్యలు ఉన్నవి. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న మా సమస్యలు మాత్రం తిరడంలేదు. మన గ్రామంలొని సమస్యలు మచ్చుకు కొన్ని

- ప్రతి గ్రామంలో మాదిరిగానే రాష్ట్రంలొ , నియోజక వర్గాలలో అధికారం లో నున్న ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ ఫలాలూ అందుతున్నవి. అందరికి సమన్యాయం జరేగెట్లు చూడాలి.
- గ్రామంలో వాటర్ పైపు లైనులను ప్రక్షాళన చేయాలి(3 or 4 ఇంచ్ పైపులు వేయాలి )
-నూతనంగా రెండు బోర్లను వేసి , రోజు తప్పిచి రోజు ఇంటింటికీ నిటి సౌకర్యం అందేలా చూడాలి .
- గ్రంధాలయం నిర్మాణం మరియు పుస్తకాల సేకరణ
-విద్యుత్ దీపాల పునరుద్దరణ
-పోచమ్మ గుడి వద్ద భవన నిర్మాణం .
-మురికి కాలువలు నిర్మాణం మరియు కనీసం నెలకోసరైన శుబ్రపచ్చుట.
- గ్రామంలో సంపూర్ణంగా సి. సి రోడ్ల నిర్మాణం జరిగేల చూడాలి
-పూర్తిగా బెల్టు షాపులను తొలగించాలి.
-యువత కోసం ఆటస్థల సేకరణ మరియు ఆట వస్తువుల కొనుగోలు.
- అర్హత గల వారికే ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పధకాలు అందేలా చూడాలి.
- అందరికి మరుగుదొడ్లు నిర్మాణం జరిగేల చూడాలి. ప్రభుత్వ పధకాలను స్వదినియోగించుకొనేటట్లు చూడాలి.

-ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రోజున స్కూల్ పిల్లలకు గ్రామా పంచాయతి తరుపున వ్యాస రచన, చెస్ , మొ// పోటీలను పెట్టి , సాయత్రం గ్రమపంచయతి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి కార్యక్రమనతరం బహుమతులు ప్రదానం చేయాలి.
-సీతారాంపురం మెయిన్ రోడ్ మీది బస్సుషెల్ద్ పునరుద్దరించాలి మరియు మరుగుదొడ్డి నిర్మాణం.
- చెరువుల పుడికలను ప్రభుత్వ పధకాల సహాయంతో తిఎంచాలి.
గమనిక: మరిన్ని సమస్యలు... మీకు తెలిసినవి కామెంట్ లో తెలుపగలరు.

పై సమస్యలు ఎవరైతే తీరుస్తారని అని
మీకు అనిపిస్తే మీ మనస్ససాక్షికి అనుసారంగా మీ అమూల్యమైన వోట్ ని వేయగలరు.

వానకొండ లక్ష్మినరసింహస్వామి.... గోవింద.. గోవింద...


 ఈ సోమవారం17-03-2014 తేది నుండి తీర్దం(ఉత్సవం) మొదలైన సందర్బంగా వానకొండ లక్ష్మి నరసింహ స్వామి భక్తులకోసం.........


కడవెండి సీతారాంపురం గ్రామానికి దగ్గరిలో శ్రీ వానకొండ లక్ష్మినరసింహస్వామి గుట్ట ఉంది. ఈ గుట్ట మీద లక్ష్మి  నరసింహస్వామి వారు ప్రతి సంవత్సరం సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా ఎక్కువగా  మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణమాసము  (ఫాల్గుణ పూర్ణిమ), పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు గుట్ట పై ఆసీనులౌతారు. అంటే హోలీ పండుగ ని పురస్కరించుకొని 'కామ'దహనం' ముగిసిన తర్వాత గుట్టపై వెలుస్తాడు.
ఈ గుట్టను "శ్రీ వానకొండ లక్ష్మి నరసింహ స్వామి" గుట్టగా ఇక్కడి ప్రజలు పిలుస్తారు.  ఇలా వెలసిన లక్ష్మి నరసింహ స్వామి వారు 15 రోజుల పాటు(ఉగాది వరకు) భక్తుల పూజలను అందుకుంటాడు.


ముఖ్యంగా  దేవరుప్పుల మండలం లోని గ్రామాల ప్రజలు  ప్రతి ఇంటికొక ఎడ్లబండిని కట్టి గుట్ట దగ్గరికి వస్తున్న క్రమంలో ముందు ఆంజనేయ స్వామి గుడి వస్తుంది మొదట ఇక్కడ బండిని ఆపి ఆంజనేయ స్వామి వారికీ కోబరికాయ కొట్టి స్వామి వారి ఆశిషులు తీసుకుంటాము. ఈ ఆంజనేయ స్వామి గుడిని సీతారాంపురం గ్రామా భక్తుడు పునరుద్దిన్చినట్లు చెపుతారు. ఇక్కడి నుండి వానకొండ గుట్టకు చేరుకుంటాము. ఈ గుట్ట  క్రింద పెద్ద గుండు(బండ రాయి) చుట్టూ ఎడ్లబండ్లని తిప్పుతూ

గోవింద............ గోవింద................ వనకొండ లక్ష్మి నరసింహస్వామి......

 గోవింద............. గోవింద.............. అనుకుంటూ వారి భక్తిని చాటుతారు.
ఈ గుండు వద్దేనే  మేకలను,కోళ్ళను కోసి స్వామి వారి మొక్కులను తీర్చుకుంటారు.ఈ వేడుకల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు, హుషారుగా పాల్గొన్నారు.  గుట్టపై వెలసిన స్వామి వారికీ  కొబ్బరికాయలు,ప్రత్యేక పూజలతో  స్వామి వారిని దర్శించుకుంటారు. గుట్ట కింద  భక్తులు వనభోజనముగా వండుకొని,కుటుంబ సమేతముగా బోజనము చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఇక్కడ అనేక దుకాణాలు తిరుణలుగా, భక్తులకు కనువిందును కలిగిస్తాయి. ఇక్కడికి తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులతోటి ఈ ప్రాంత మంత తడిసిముద్దవుతుంది. సాయంత్రసమయములో భక్తులు దుకాణాలలో కిక్కిరిసి పోతారు.


ఈ 15 రోజులు   "శ్రీ వాన కొండ లక్ష్మి నరసింహస్వామి" వారు భక్తుల కోరికలను తీరుస్తాడు. చివరి రోజైన "ఉగాది పండగ" రోజు స్వామి వారు "ఉగాది పచ్చడి" ని తాగి తిరిగి కడవెండి గ్రామానికి చేరుకుంటాడు.
ఇంతటి తో ఈ ఉత్సవం ముగిస్తుంది.

మీ
కడవెండి సీతారాంపురం.