మాజీ సర్పంచ్‌ రాంనర్సయ్య కన్నుమూత:

కడవెండి సీతారాంపురం న్యూస్ లైన్ (07/09/14):- సీతారాంపురం మాజీ సర్పంచ్ బస్వ రాంనర్సయ్య కన్నుమూశారు.ఆయన కొంత కాలంగా పచ్చవాతం తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కాలుజారి బాత్రూంలో పడడంతో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ చికిత్య పొందుతూ నిన్న మధ్యాహ్నం తన చివరి శ్వాస విడిచారు. తన రాజకీయ జీవితంలో సుధీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి, గ్రామానికి ప్రధమ సర్పంచ్ గా 1996లో ఎన్నికై చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఆప్తుడు, నిగర్వి,స్నేహశీలి, ముక్కుసూటితనం, మంచితనం గ్రామానికి సేవలందించేలా చేసింది.


గ్రామాభివృద్ధిలో రాం నర్సయ్య


గ్రామంలో మంచి నీటి కోసం అనేక బోర్లను, చేతి పంపులను వేయీంచారువాడ వాడకు నీటిని నిలువచేసే నీటి ట్యాంక్ లను నిర్మించి గ్రామా ప్రజలకు నీటి సమస్య నుండి విముక్తి చేశారు. ఇంటింటికీ నీటి అవసరాన్ని తీర్చడానికి వాడవాడకు నీటి పైపులైను లను వేయీంచి ప్రతి ఇంటికి నాల్లాలను ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఉన్న గ్రామా పంచాయతి,బడిలో ఉన్న కొత్త బిల్డింగ్ ను కూడా వీరే కట్టించారు.పాత మొరిలను, చెరువుల వద్ద, అనేక చెక్డంలు నిర్మించారు.వీరి హయంలో ఓవర్ ట్యాంక్ నిర్మాణం, చాల మందికి ఇందిరమ్మ ఇండ్లు, లేట్రూమ్లు, అనేక ప్రభుత్వ పథకాలు మన గ్రామా ప్రజలకు అందేలా చూశారు..గ్రామా ప్రజల పంచాయతీలు అనేకం పరిష్కరించి, గ్రామానికి పెద్ద దిక్కుగా కొనసాగారు.వారి కష్టసుఖములలో పలు పంచుకునే వారు . ఈయన మరణం గ్రామానికి తీరనిలోటు అని గ్రామస్థులు తెలిపారు. ప్రతి వారితోను స్నేహశిలిగా మెలిగే వారని, గ్రామంలోని ప్రజలందరినీ వరసలతో ప్రేమబిమనలతో పిలిచేవా
రని,చిన్న, పెద్ద తేడాలు లేకుండా ప్రతి వారితో ప్రేమగా మాట్లాడే వారని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. గ్రామానికి పెద్ద దిక్కు కోలుపోయమని గ్రామస్తులు దిర్బంతిని వ్యక్తంచేశారు.


బస్వ రాం నర్సయ్య కుటుంబానికి, గ్రామ ప్రజలకు కడవెండి సీతారాంపురం తరుపున ప్రగాఢ సానుబూతిని తెలియ జేస్తూ,వారి ఆత్మకు శాంతి చేకురాలను కోరుకుంటూ ........
మీ
కడవెండి సీతారాంపురం.