నిజాయతిగల ప్రజా నాయకులు కావాలి .


రాజకీయం చేసి నాయకులూ మాకొద్దు, నిజాయతి గల ప్రజా నాయకులు కావాలి .
అధికారం కోసం వచ్చే నాయకులు మాకొద్దు, సేవచేసే నాయకులూ కావాలి.
కోట్లను మింగే తిమింగలాలుమాకొద్దు, మా ధనాన్ని కాపాడే కాపలా....... కావాలి.
అదికరంతో రాజదానిలో ఉండే వాళ్ళు మాకొద్దు, మా వెంటే ఉండే జీతగాళ్ళు కావాలి.

"రైతే రాజు" , రైతు ప్రభుతం మాది అంటారు, మరి రైతుల ఆత్మహత్య లెందుకు?
మీ పిల్లలకు ఇంగ్లీష్ స్కూల్స్ , ఇంటర్నేషనల్ విద్య, మా పిల్లలకు గవెర్నమెంట్ స్కూల్స్, ఉపాది విద్య.
మా డబ్బులతో మాకు పనిచేయమంటే, మీ డబ్బులగా బ్యాంకులలో దాచుడేలా?
ఎన్నికల సమయంలోనే నివు, మాకు జీతగాడివాని గుర్తోచిందా?
ఒకడు చిపిరిబట్టి రోడ్డుకుతున్నాడు , మరొక్కడు బట్టలుతుకుతున్నాడు
డప్పుకోడుతడు , చిందులేస్తాడు, వంటోన్డుతడు, పాలు పితుకుతడు..
ఇలా ఎన్నో పిచ్చిపనులన్ని చేస్తారు .
ఎన్నికలైపోతే వాణ్ణి చూడానికి కండ్లు కయలుకయలె, గంటలకొద్దీ వెట్ చేయాలి.
ఇచ్చిన హమిలన్ని గుర్తు చేసిన విని, వినిపించానట్లే వెళ్ళిపోతాడు. ఇది మన నాయకుల తీరు...

సో ఫ్రెండ్స్ దయచేసి మీరు అలోచినండి. మన వియోజకవర్గంలో ఎవరైతే ఎల్లపుడు ప్రజలతో ఉండి , ప్రజా సమస్యలను తెలుసుకొని, జవాబుదారిగా ఉండే నాయకుడినే ఎన్నుకోండి. పార్టీలన్నీ పక్కన పెట్టండి . వక్తిని చూసి మీ ఓటుని వేయండి.

మీ
కడవెండి సీతారాంపురం.

మారని బ్రతుకులు

రాష్ట్రలలో, దేశంలో ప్రభుత్వలు, నాయకులూ మారుతున్నా..
గ్రామ ప్రజల జివితాలల్లో మాత్రం మార్పు అంతంత మాత్రంగానే ఉంది.
దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలూ,
" రైతే రాజు" అన్న ప్రభుత్వలు,
నీచమైన రాజకీయాలకు...
బలిఅవుతున్న రైతన్నల కష్టలు
ఎవరికీ కన్పించవు? రైతు అప్పుల బాధ తో ఆత్మహత్య చేసుకుంటే ,
శవరాజకియలకు కూడా వెనుకాడని నీచాతి నీచమైన రాజకీయాలకు పునాదులపై రాజకీయ భవనాలు కడుతున్నారు.
చావలేక, బ్రతకలేక , మధ్యతరగతి, ఆర్దిక ఇబ్బందులలో రైతులు తమ జీవితాలను నేట్టుకోస్తుంటే... వచ్చిరాని హామీలతో , మసిపూసి మారేడుకాయని చేసి అధికారం అందుకోవాలనుకుంటునవే! నిత్యావసరాల దరలు ఆకాశానికి తాకుతుంటే ,రూపాయీ పతనమై దరలన్ని పెరుగుతుంటే , రైతన్నల చెమట చుక్కలతో పండించిన పంటలకేండుకురా దరలు పెంచారు? ఏ ముఖం పెట్టుకొని వచ్చారురా?
అన్నదమ్ములగా కలిసుండే గ్రామా ప్రజల మద్య చిచ్చు పెట్టరెందుకురా? ఇరుగు పొరుగు వాళ్ళను శత్రువులను చేశావుగాదరా? కులాల మద్య , మతాల మద్య విద్వేషాలను రెచ్చ గోట్టరుగాదరా? మీ అధికారం కోసం దేశామేమైన పరవాలేదు అన్నట్లు ప్రవర్తిస్తునారేందుకు ?

కడవెండి సీతారాంపురం.

సీతారాంపురం గ్రామ సమస్యలు

బారత దేశం లో ఒకానొక చిన్న మారుమూల గ్రామం కడవెండి సీతారాంపురం.
గ్రామాలూ అబివృద్ది చెందుతే దేశం అబివృద్ది చెందినట్టు అంటారే ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నట్టే మా గ్రామంలో కూడా సమస్యలు ఉన్నవి. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న మా సమస్యలు మాత్రం తిరడంలేదు. మన గ్రామంలొని సమస్యలు మచ్చుకు కొన్ని

- ప్రతి గ్రామంలో మాదిరిగానే రాష్ట్రంలొ , నియోజక వర్గాలలో అధికారం లో నున్న ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ ఫలాలూ అందుతున్నవి. అందరికి సమన్యాయం జరేగెట్లు చూడాలి.
- గ్రామంలో వాటర్ పైపు లైనులను ప్రక్షాళన చేయాలి(3 or 4 ఇంచ్ పైపులు వేయాలి )
-నూతనంగా రెండు బోర్లను వేసి , రోజు తప్పిచి రోజు ఇంటింటికీ నిటి సౌకర్యం అందేలా చూడాలి .
- గ్రంధాలయం నిర్మాణం మరియు పుస్తకాల సేకరణ
-విద్యుత్ దీపాల పునరుద్దరణ
-పోచమ్మ గుడి వద్ద భవన నిర్మాణం .
-మురికి కాలువలు నిర్మాణం మరియు కనీసం నెలకోసరైన శుబ్రపచ్చుట.
- గ్రామంలో సంపూర్ణంగా సి. సి రోడ్ల నిర్మాణం జరిగేల చూడాలి
-పూర్తిగా బెల్టు షాపులను తొలగించాలి.
-యువత కోసం ఆటస్థల సేకరణ మరియు ఆట వస్తువుల కొనుగోలు.
- అర్హత గల వారికే ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పధకాలు అందేలా చూడాలి.
- అందరికి మరుగుదొడ్లు నిర్మాణం జరిగేల చూడాలి. ప్రభుత్వ పధకాలను స్వదినియోగించుకొనేటట్లు చూడాలి.

-ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రోజున స్కూల్ పిల్లలకు గ్రామా పంచాయతి తరుపున వ్యాస రచన, చెస్ , మొ// పోటీలను పెట్టి , సాయత్రం గ్రమపంచయతి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి కార్యక్రమనతరం బహుమతులు ప్రదానం చేయాలి.
-సీతారాంపురం మెయిన్ రోడ్ మీది బస్సుషెల్ద్ పునరుద్దరించాలి మరియు మరుగుదొడ్డి నిర్మాణం.
- చెరువుల పుడికలను ప్రభుత్వ పధకాల సహాయంతో తిఎంచాలి.
గమనిక: మరిన్ని సమస్యలు... మీకు తెలిసినవి కామెంట్ లో తెలుపగలరు.

పై సమస్యలు ఎవరైతే తీరుస్తారని అని
మీకు అనిపిస్తే మీ మనస్ససాక్షికి అనుసారంగా మీ అమూల్యమైన వోట్ ని వేయగలరు.