వేసవి - జ్జాపకాలు


5. దాడి ఆట :


ఈ ఆట మెదడుకు పని చెప్పుతుంది.
ఆలోచన శక్తిని పెంచుతుంది.
ఎదుగుతున్న పిల్లలలో జ్ఞానసంవృద్దిని పెంచుతూ,
జీవితం మీద గుండెల్లో విశ్వాసంని నింపుతుంది .

ఈ ఆటలో ఇద్దరు ఆటగాళ్ళు వుంటారు.
ఒక్కొక్కరికి తొమ్మిది తొమ్మిది చొప్పున చింత గింజలు/ రాళ్ళూ /కట్టే పుల్లలు
ఏవో ఒకటి ఎవరి వస్తువులు ఎవరిదో గుర్తుపట్టడానికి వేరు వేరుగా తీసుకోవాలి. కింది బొమ్మలో ఎరుపు రంగు సున్నాలలో ఒకరి తరువాత ఒకరు తమ పావుల్ని(వస్తువులు) పెట్టాలి. అడ్డంగాకాని, నిలువుగా కాని, క్రాస్‌గా కాని మూడూ ఒకే రకం పావులు వస్తే ఒక దాడి జరిగినట్లు.
దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి పావుల నుంచి దాడికని పావును తీసుకుంటారు.

ఇలా తొమ్మిది పావులు పేర్చడం అయ్యాక పావులకు కదలిక వస్తుంది. ఒక కూడలి నుంచి మరో కూడలికి కదలొచ్చు. మళ్ళీ మూడూ ఒక వరుసలోకి చేరగానే అవతలి వాడి పావుని తీసుకోవచ్చు. ఒకసారి దాడి జరిపిన పావును , ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి పావులన్ని పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును.

ఈ ఆటతో పాటు
ముడురాళ్ళ దాడి ఆట కూడా ఆడుకోవచును.
పైన తిలిపిన ఆటలాగే ఈ ఆట ను ఆడుతారు కాకపోతే ఈ ఆట లో మూడు పావులు మాత్రమే ఉంటై.
ఈ ఆటను ఎక్కువగా బావి దగ్గర పశువులను మేపుతూ ఆడుకోనే టోల్లం.
చాలెంజ్ గా తీసుకోని చాల సీరియస్ గా ఆడేవాళ్ళం.
అపుడప్పుడు పైసలుకుడా బెట్టు పెట్టుకోనే టోల్లం.
టైంపాస్ కి ,మేధాశక్తికి ఈ ఆట ఎంతో ఉపయోగంసుమా..

ధన్యవాదాలు మిత్రుల్లారా !!

ఇట్లు
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.