కడవెండి సీతారాంపురం,న్యూస్లైన్(డిసెంబర్ 28): గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా చాలా గ్రామాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు. వివరలోకేల్లితే ఈ సారి వర్షాలు లేని కారణంగా దేవరుప్పుల మండల ప్రాతాలలో ఎక్కడ కూడా చెరువులు, కుంటలు, వాగుల్లో నీరు నిండలేదు. దీనితో భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావుల్లో నీటి మట్టం తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 100 కు పైగా బస్తాలు పండించిన రైతులు నేడు వర్షాలు లేక పొలాలు బీడుపడి పల్లెలను వదిలి వలస బాటపడుతున్నారు. ఉపాధి కరువై అప్పులపాలయ్యారు. అందరి ఆకలి తీర్చే అన్నదాత పొట్ల చేత పట్టుకొని పట్టణాల లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా అవతారమెత్తారు. గ్రామంలో బోర్లన్ని అడుగంటి పోయీ, దిక్కు తోచని పరిస్థిలో రైతులు దయనీయమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు.వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలెట్టాక పోవడంతో వ్యవసాయ కూలీలు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితే కనుక మరో సంవత్సర కాలం కొనసాగితే మా గ్రామం, మాలాంటి అనేక గ్రామాలు ఖాళీ అవుతాయనడానికి సందేహం లేదు .తక్షణం తెలంగాణా ప్రభుత్వం వలసల నివారణ కోసం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైతులకు జీవనభృతి కింద ప్రత్యేక ప్యాకేజీని పంపిణీ చేయాలని "కడవెండి సీతారాంపురం" తరుపున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది.
రైతుల వలసలపై కడవెండి సీతారాంపురం అడ్మిన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మీ,
కడవెండి సీతారాంపురం.
కడవెండి సీతారాంపురం.
No comments:
Post a Comment
kadavendisitharampuram@gmail.com
Note: only a member of this blog may post a comment.