మన ఊరి నుండి పొద్దుగాలనే హైదరాబాద్ కి
పోవాలంటే కడవెండి గ్రామం నుండి వచ్చే బస్సు 5 గంటలకు మన ఊరికి
చేరుకునేది. అప్పుడు హైదరాబాద్ కి ఛార్జ్ 52 రూపాయలే అని గుర్తు. ఈ బస్సు
నవాబ్ పేట గ్రామానికి కూడా వెళ్ళేది అక్కడినుండి జనగాం వయ భువనగిరి
టూ హైదరాబాద్ కి ఉదయం 8 గంటలకి చేరుకునేది. కానీ ఇప్పుడు మన గ్రామం నుండి
హైదరాబాద్ కి పోవాలంటే కడవెండి బస్సు ఎక్కి జనగాం లో దిగి అక్కడి నుండి
మళ్ళి హైదరాబాద్ బస్సు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కడవెండి బస్సు
ఇప్పుడు చిన్న మడుర్ కి కూడా వెళ్ళుతుంది. డైరెక్ట్ హైదరాబాద్ బస్సు
సర్వీస్ ని రద్దు చేసి జనగాం వరకే సేర్విసుని కొనసాగిస్తునారు మన జనగాం
డిపో మేనేజర్ గారు. బస్సు ఛార్జ్ ఒకప్పుడు జనగాంకి 10రూ. ఉండే ఆతర్వాత
14,17 ఉండే, ఇప్పుడు ఏకంగా 21 రుపాయలైంది. అంటే గత 20 సంవత్సరాల తో
పోలిస్తే రెండింతలైంది. హైదరాబాద్ కి వచ్చే సరికి 100 రూ అవుతుంది. అర్
టి సి మరియు ప్రభుత్వాలు కలసి ప్రజలపై ఎంత బారాన్ని మోపుతుందో
అర్ధమౌతుంది.
అసలు మన గ్రామం నుండి హైదరాబాద్ బస్సు సర్వీస్ ను ఎందుకు రద్దు చేసినట్టు? కనీసం కడవెండి మరియు సీతారాంపురం నుండి 20 కి తక్కువ కాకుండా రోజు హైదరాబాద్ కి వెళ్ళుతారు. ఇంకొందరు జనగాం కి మరికొందరు సింగరాజుపల్లి, చిన్న మడుర్, నవాబు పేట మద్యలో వచ్చే ఊరిలోనుండి కనీసం ఓ పది మంది , జనగాం లో 10 మంది మొత్తంగా సుమారు 40 కి తక్కువ కాకుండా హైదరాబాద్ కి బస్సు చేరుతది. మరి అలాంటప్పుడు ఈ కడవెండి బస్సు సర్వీస్ ని జనగాం వరకే ఎందుకు సవరించారు..? పోనీ ఒక సమయంలో తక్కువ మంది ప్రయాణం చేయడం వల్ల జనగాం మేనేజర్ గారు ఈ బస్సు సేరివిసు ని కుదించారా?
మరి ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్ కి వెళ్ళుతున్నారు కదా దీన్ని మేనేజర్ గారు మరియు కడవెండి, సీతారాంపురం గ్రామా ప్రజలు, నాయకులూ గమనించి కడవెండి బస్సు ని హైదరాబాద్ వరకు పొడగించ వలసిందిగా జనగాం డిపో మేనేజర్ గారికి విజ్ఞేప్తి పత్రంను అందజేయ వలసినది గా కోరుతున్నాను.
మళ్ళి మన గ్రామనికి జనగాం నుండి ఈ బస్సు సర్వీస్ ఉదయం 9:20 కి ఉంటుంది. 10 గంటలవరకు మన గ్రామానికి చేరుకుంటుంది. తిరిగి ఈ బస్సు 10:30కి బయలుదేరుతుంది. రాత్రి సమయంలో ఈ బస్సు జనగాం నుండి 7:15 నిముషాలకు బయలుదేరి 8:30కి మన గ్రామంలో ఉంటుంది. ఈ బస్సు సర్వీస్ ను మన కడవెండి మరియు సీతారాంపురం గ్రామస్తులందరూ వినియోగించుకోవలసిందిగా కోరుతూ...........
అసలు మన గ్రామం నుండి హైదరాబాద్ బస్సు సర్వీస్ ను ఎందుకు రద్దు చేసినట్టు? కనీసం కడవెండి మరియు సీతారాంపురం నుండి 20 కి తక్కువ కాకుండా రోజు హైదరాబాద్ కి వెళ్ళుతారు. ఇంకొందరు జనగాం కి మరికొందరు సింగరాజుపల్లి, చిన్న మడుర్, నవాబు పేట మద్యలో వచ్చే ఊరిలోనుండి కనీసం ఓ పది మంది , జనగాం లో 10 మంది మొత్తంగా సుమారు 40 కి తక్కువ కాకుండా హైదరాబాద్ కి బస్సు చేరుతది. మరి అలాంటప్పుడు ఈ కడవెండి బస్సు సర్వీస్ ని జనగాం వరకే ఎందుకు సవరించారు..? పోనీ ఒక సమయంలో తక్కువ మంది ప్రయాణం చేయడం వల్ల జనగాం మేనేజర్ గారు ఈ బస్సు సేరివిసు ని కుదించారా?
మరి ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్ కి వెళ్ళుతున్నారు కదా దీన్ని మేనేజర్ గారు మరియు కడవెండి, సీతారాంపురం గ్రామా ప్రజలు, నాయకులూ గమనించి కడవెండి బస్సు ని హైదరాబాద్ వరకు పొడగించ వలసిందిగా జనగాం డిపో మేనేజర్ గారికి విజ్ఞేప్తి పత్రంను అందజేయ వలసినది గా కోరుతున్నాను.
మళ్ళి మన గ్రామనికి జనగాం నుండి ఈ బస్సు సర్వీస్ ఉదయం 9:20 కి ఉంటుంది. 10 గంటలవరకు మన గ్రామానికి చేరుకుంటుంది. తిరిగి ఈ బస్సు 10:30కి బయలుదేరుతుంది. రాత్రి సమయంలో ఈ బస్సు జనగాం నుండి 7:15 నిముషాలకు బయలుదేరి 8:30కి మన గ్రామంలో ఉంటుంది. ఈ బస్సు సర్వీస్ ను మన కడవెండి మరియు సీతారాంపురం గ్రామస్తులందరూ వినియోగించుకోవలసిందిగా కోరుతూ...........
No comments:
Post a Comment
kadavendisitharampuram@gmail.com
Note: only a member of this blog may post a comment.