వేసవి - జ్జాపకాలు


1.సైకిల్ టైరు ఆట:


సైకిల్ టైరు..
రిములతో పరుగు..
తెలియకుండానే ప్రక్రతితో చెలిమీ...
ఇంటి దగ్గరనుంచి బడి దగ్గరికి...
బడి దగ్గరి నుంచి బావికాడికి...
ఇలా సైకిల్ టైరు ముందు, నేను వెనుకాల...
ఊరు మొత్తం ఒకటే పరుగులు....
అమ్మ ఆరుపులు...
నాన్న పరుగులు..
నన్ను ఆపేవాళ్ళు ఎవరు...?
ప్రక్రతి వడిలో నా బాల్యం...
చూస్తుండగానే గడిచేను మదురానుభవం...

ఇట్లు,
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


ఎండాకాలం వచ్చింది... సెలవులెన్నో తెచ్చింది...

వేసవి సెలవులు పిల్లల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతాయి. ఆటలు, పాటలు, విహారాలు వారి మనోవికాసానికి బాటలు వేస్తాయి. ఏడాది అంతా పుస్తకాల మోతలు, హోంవర్కులు, మార్కులు సాధనతో విసిగిపోయిన పిల్లలకు ఆటవిడుపుగా మరుతునై. కొత్త ప్రదేశాలు, నూతన స్నేహాలు, ఆసక్తి నింపే అంశాలు వారిలో కొత్త కాంతులు నింపుతాయి. శరీరారోగ్యానికి ముఖ్యమైనవి ఆటలు.
మనకు ఆటలు అనగానే చిన్నప్పటి రోజులే గుర్తుకు వస్తుంటయీ..!
ఈ ఆటలు మానసిక వ్యాయామానికి,నాయకత్వలక్షణాలకు,ఒక పని ఎలా చేయాలి దానికి కావలసిన ఓపిక ఇలా ఎన్నో నేర్పుతుంది అనే చెప్పాలి.
మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలను మన పిల్లలు ఆడుకునేలా పరిస్తితులు కల్పిస్తున్నమా..? ఈ వెసని సెలవులను పూర్తిగా పిల్లల ఇష్టనికి వదిలేద్దాం.
మనం కూడా మన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుందాం. మనం మన చిన్ననాటి ఆటలు, అల్లర్లను ఈ వేసవి రోజుల్లో నేమరేసుకుందాం!!

మన అందరికోసం "కడవెండి సీతారాంపురం" ఈ వేసవి కాలం ఒక కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ కార్యక్రమం పేరు '' నా జ్జాపకాలు ". ఈ కార్యక్రమంలో మనం/నేను ఆడిన ఆటలను గుర్తుచేయడం దీని ఉదేశ్యం. మీ చిన్ననాటి జ్జాపకాలు మాతో పంచుకోండి..!! మన సంస్కృతి,సాంప్రదాయతో ముడిపడిన మన బాల్యాన్ని రాబోవు ఆదునిక యంత్ర ప్రపంచానికి అదించండి.
మీరు మాకు సూచనలు, సలహాలు పంపించాలని అనిపిస్తే kadavendisitharampuram@gmail.com మెయిల్ కి సెండ్ చేయగలరు.

ఇట్లు,
కడవెండి సీతారాంపురం.

నిజాయతిగల ప్రజా నాయకులు కావాలి .


రాజకీయం చేసి నాయకులూ మాకొద్దు, నిజాయతి గల ప్రజా నాయకులు కావాలి .
అధికారం కోసం వచ్చే నాయకులు మాకొద్దు, సేవచేసే నాయకులూ కావాలి.
కోట్లను మింగే తిమింగలాలుమాకొద్దు, మా ధనాన్ని కాపాడే కాపలా....... కావాలి.
అదికరంతో రాజదానిలో ఉండే వాళ్ళు మాకొద్దు, మా వెంటే ఉండే జీతగాళ్ళు కావాలి.

"రైతే రాజు" , రైతు ప్రభుతం మాది అంటారు, మరి రైతుల ఆత్మహత్య లెందుకు?
మీ పిల్లలకు ఇంగ్లీష్ స్కూల్స్ , ఇంటర్నేషనల్ విద్య, మా పిల్లలకు గవెర్నమెంట్ స్కూల్స్, ఉపాది విద్య.
మా డబ్బులతో మాకు పనిచేయమంటే, మీ డబ్బులగా బ్యాంకులలో దాచుడేలా?
ఎన్నికల సమయంలోనే నివు, మాకు జీతగాడివాని గుర్తోచిందా?
ఒకడు చిపిరిబట్టి రోడ్డుకుతున్నాడు , మరొక్కడు బట్టలుతుకుతున్నాడు
డప్పుకోడుతడు , చిందులేస్తాడు, వంటోన్డుతడు, పాలు పితుకుతడు..
ఇలా ఎన్నో పిచ్చిపనులన్ని చేస్తారు .
ఎన్నికలైపోతే వాణ్ణి చూడానికి కండ్లు కయలుకయలె, గంటలకొద్దీ వెట్ చేయాలి.
ఇచ్చిన హమిలన్ని గుర్తు చేసిన విని, వినిపించానట్లే వెళ్ళిపోతాడు. ఇది మన నాయకుల తీరు...

సో ఫ్రెండ్స్ దయచేసి మీరు అలోచినండి. మన వియోజకవర్గంలో ఎవరైతే ఎల్లపుడు ప్రజలతో ఉండి , ప్రజా సమస్యలను తెలుసుకొని, జవాబుదారిగా ఉండే నాయకుడినే ఎన్నుకోండి. పార్టీలన్నీ పక్కన పెట్టండి . వక్తిని చూసి మీ ఓటుని వేయండి.

మీ
కడవెండి సీతారాంపురం.

మారని బ్రతుకులు

రాష్ట్రలలో, దేశంలో ప్రభుత్వలు, నాయకులూ మారుతున్నా..
గ్రామ ప్రజల జివితాలల్లో మాత్రం మార్పు అంతంత మాత్రంగానే ఉంది.
దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలూ,
" రైతే రాజు" అన్న ప్రభుత్వలు,
నీచమైన రాజకీయాలకు...
బలిఅవుతున్న రైతన్నల కష్టలు
ఎవరికీ కన్పించవు? రైతు అప్పుల బాధ తో ఆత్మహత్య చేసుకుంటే ,
శవరాజకియలకు కూడా వెనుకాడని నీచాతి నీచమైన రాజకీయాలకు పునాదులపై రాజకీయ భవనాలు కడుతున్నారు.
చావలేక, బ్రతకలేక , మధ్యతరగతి, ఆర్దిక ఇబ్బందులలో రైతులు తమ జీవితాలను నేట్టుకోస్తుంటే... వచ్చిరాని హామీలతో , మసిపూసి మారేడుకాయని చేసి అధికారం అందుకోవాలనుకుంటునవే! నిత్యావసరాల దరలు ఆకాశానికి తాకుతుంటే ,రూపాయీ పతనమై దరలన్ని పెరుగుతుంటే , రైతన్నల చెమట చుక్కలతో పండించిన పంటలకేండుకురా దరలు పెంచారు? ఏ ముఖం పెట్టుకొని వచ్చారురా?
అన్నదమ్ములగా కలిసుండే గ్రామా ప్రజల మద్య చిచ్చు పెట్టరెందుకురా? ఇరుగు పొరుగు వాళ్ళను శత్రువులను చేశావుగాదరా? కులాల మద్య , మతాల మద్య విద్వేషాలను రెచ్చ గోట్టరుగాదరా? మీ అధికారం కోసం దేశామేమైన పరవాలేదు అన్నట్లు ప్రవర్తిస్తునారేందుకు ?

కడవెండి సీతారాంపురం.

సీతారాంపురం గ్రామ సమస్యలు

బారత దేశం లో ఒకానొక చిన్న మారుమూల గ్రామం కడవెండి సీతారాంపురం.
గ్రామాలూ అబివృద్ది చెందుతే దేశం అబివృద్ది చెందినట్టు అంటారే ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నట్టే మా గ్రామంలో కూడా సమస్యలు ఉన్నవి. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న మా సమస్యలు మాత్రం తిరడంలేదు. మన గ్రామంలొని సమస్యలు మచ్చుకు కొన్ని

- ప్రతి గ్రామంలో మాదిరిగానే రాష్ట్రంలొ , నియోజక వర్గాలలో అధికారం లో నున్న ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ ఫలాలూ అందుతున్నవి. అందరికి సమన్యాయం జరేగెట్లు చూడాలి.
- గ్రామంలో వాటర్ పైపు లైనులను ప్రక్షాళన చేయాలి(3 or 4 ఇంచ్ పైపులు వేయాలి )
-నూతనంగా రెండు బోర్లను వేసి , రోజు తప్పిచి రోజు ఇంటింటికీ నిటి సౌకర్యం అందేలా చూడాలి .
- గ్రంధాలయం నిర్మాణం మరియు పుస్తకాల సేకరణ
-విద్యుత్ దీపాల పునరుద్దరణ
-పోచమ్మ గుడి వద్ద భవన నిర్మాణం .
-మురికి కాలువలు నిర్మాణం మరియు కనీసం నెలకోసరైన శుబ్రపచ్చుట.
- గ్రామంలో సంపూర్ణంగా సి. సి రోడ్ల నిర్మాణం జరిగేల చూడాలి
-పూర్తిగా బెల్టు షాపులను తొలగించాలి.
-యువత కోసం ఆటస్థల సేకరణ మరియు ఆట వస్తువుల కొనుగోలు.
- అర్హత గల వారికే ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పధకాలు అందేలా చూడాలి.
- అందరికి మరుగుదొడ్లు నిర్మాణం జరిగేల చూడాలి. ప్రభుత్వ పధకాలను స్వదినియోగించుకొనేటట్లు చూడాలి.

-ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రోజున స్కూల్ పిల్లలకు గ్రామా పంచాయతి తరుపున వ్యాస రచన, చెస్ , మొ// పోటీలను పెట్టి , సాయత్రం గ్రమపంచయతి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి కార్యక్రమనతరం బహుమతులు ప్రదానం చేయాలి.
-సీతారాంపురం మెయిన్ రోడ్ మీది బస్సుషెల్ద్ పునరుద్దరించాలి మరియు మరుగుదొడ్డి నిర్మాణం.
- చెరువుల పుడికలను ప్రభుత్వ పధకాల సహాయంతో తిఎంచాలి.
గమనిక: మరిన్ని సమస్యలు... మీకు తెలిసినవి కామెంట్ లో తెలుపగలరు.

పై సమస్యలు ఎవరైతే తీరుస్తారని అని
మీకు అనిపిస్తే మీ మనస్ససాక్షికి అనుసారంగా మీ అమూల్యమైన వోట్ ని వేయగలరు.

వానకొండ లక్ష్మినరసింహస్వామి.... గోవింద.. గోవింద...


 ఈ సోమవారం17-03-2014 తేది నుండి తీర్దం(ఉత్సవం) మొదలైన సందర్బంగా వానకొండ లక్ష్మి నరసింహ స్వామి భక్తులకోసం.........


కడవెండి సీతారాంపురం గ్రామానికి దగ్గరిలో శ్రీ వానకొండ లక్ష్మినరసింహస్వామి గుట్ట ఉంది. ఈ గుట్ట మీద లక్ష్మి  నరసింహస్వామి వారు ప్రతి సంవత్సరం సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా ఎక్కువగా  మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణమాసము  (ఫాల్గుణ పూర్ణిమ), పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు గుట్ట పై ఆసీనులౌతారు. అంటే హోలీ పండుగ ని పురస్కరించుకొని 'కామ'దహనం' ముగిసిన తర్వాత గుట్టపై వెలుస్తాడు.
ఈ గుట్టను "శ్రీ వానకొండ లక్ష్మి నరసింహ స్వామి" గుట్టగా ఇక్కడి ప్రజలు పిలుస్తారు.  ఇలా వెలసిన లక్ష్మి నరసింహ స్వామి వారు 15 రోజుల పాటు(ఉగాది వరకు) భక్తుల పూజలను అందుకుంటాడు.


ముఖ్యంగా  దేవరుప్పుల మండలం లోని గ్రామాల ప్రజలు  ప్రతి ఇంటికొక ఎడ్లబండిని కట్టి గుట్ట దగ్గరికి వస్తున్న క్రమంలో ముందు ఆంజనేయ స్వామి గుడి వస్తుంది మొదట ఇక్కడ బండిని ఆపి ఆంజనేయ స్వామి వారికీ కోబరికాయ కొట్టి స్వామి వారి ఆశిషులు తీసుకుంటాము. ఈ ఆంజనేయ స్వామి గుడిని సీతారాంపురం గ్రామా భక్తుడు పునరుద్దిన్చినట్లు చెపుతారు. ఇక్కడి నుండి వానకొండ గుట్టకు చేరుకుంటాము. ఈ గుట్ట  క్రింద పెద్ద గుండు(బండ రాయి) చుట్టూ ఎడ్లబండ్లని తిప్పుతూ

గోవింద............ గోవింద................ వనకొండ లక్ష్మి నరసింహస్వామి......

 గోవింద............. గోవింద.............. అనుకుంటూ వారి భక్తిని చాటుతారు.
ఈ గుండు వద్దేనే  మేకలను,కోళ్ళను కోసి స్వామి వారి మొక్కులను తీర్చుకుంటారు.ఈ వేడుకల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు, హుషారుగా పాల్గొన్నారు.  గుట్టపై వెలసిన స్వామి వారికీ  కొబ్బరికాయలు,ప్రత్యేక పూజలతో  స్వామి వారిని దర్శించుకుంటారు. గుట్ట కింద  భక్తులు వనభోజనముగా వండుకొని,కుటుంబ సమేతముగా బోజనము చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఇక్కడ అనేక దుకాణాలు తిరుణలుగా, భక్తులకు కనువిందును కలిగిస్తాయి. ఇక్కడికి తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులతోటి ఈ ప్రాంత మంత తడిసిముద్దవుతుంది. సాయంత్రసమయములో భక్తులు దుకాణాలలో కిక్కిరిసి పోతారు.


ఈ 15 రోజులు   "శ్రీ వాన కొండ లక్ష్మి నరసింహస్వామి" వారు భక్తుల కోరికలను తీరుస్తాడు. చివరి రోజైన "ఉగాది పండగ" రోజు స్వామి వారు "ఉగాది పచ్చడి" ని తాగి తిరిగి కడవెండి గ్రామానికి చేరుకుంటాడు.
ఇంతటి తో ఈ ఉత్సవం ముగిస్తుంది.

మీ
కడవెండి సీతారాంపురం.