గూగుల్ మ్యాప్ లో మన గ్రామం




అనాధ వృద్ద అశ్రమం

సీతారాంపురం లో Mr. Masetti Laxminarayana గారు స్థాపించిన => ప్రేమ సదనం అనాధ వృద్ద సంగం గురించి పూర్తి వివరాలు ఈ క్రింది వెబ్ సైట్ లో పొందు పర్చబదినవి. ఈ లింక్ ని క్లిక్ చేయండి.  
                    
ప్రేమ సదనం అనాధ వృద్ద అశ్రమం

మీ సలహాలు పంపవలసిన మెయిల్ ఐ డి

ప్రియమైన  మిత్రులారా మన సీతారాంపురం పల్లె జీవనం కు సంబంధించి  మధుర జ్ఞాపకాలు , మిమ్మల్ని కదిలించిన, మీరు స్పూర్తి పొందిన సంగటనలు, వ్యాసాలను, మీ రచనలు, మీకు నచ్చిన మన గ్రామ నాయకులు మొదలైన వారిగురించి మాకు  పంపండి. ఈ పేజీ లో ఉంచుతాము. ఫోటో లు ఐన పరవాలేదు  ఏదైనా సరే మా ఇ మెయిల్ ఐ డి కి సెండ్ చేయండి.
మా  Mail ID: kadavendisitharampuram@gmail.com

ఇట్లు
మీ,
కడవెండి సీతారాంపురం.

సీతారాంపురంలో శుద్దజల కేంద్రం



సీతారాంపురంలో నీళ్ళ సమస్య ..?


                     సీతారాంపురం లో ఒకప్పుడు గృహూపకరనాలకు అవసరమైన నీటి కోసం గ్రామానికి దగ్గరిలోనున్న వ్యవసాయ బావి వద్ద మరియు గ్రామంలో  అక్కడక్కడా ఉండే చేతి పంపుల వద్ద బారులు తీసి గంటల కొద్ది పడిగాపులు కాసే వారు. ఇక మంచి నీటి కోసం వాగు ఒడ్డుకు పోయి క్యాన్ లల్లో, బిందలల్లో తేసుకోచ్చేవారు. మరికొందరు గ్రామంలోని  మంచి నీటి బావి కాడికి వెళ్లి తెచ్చేవారు( ఈ మంచి నీళ్ళ బావి గుంటి ఘట్టయ్య  ఇంటి ముందు ఉండేటిది). ఈ బావిలోకి దిగాలంటే ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని వేల్లసిందే ఎందుకంటే  ఆ బావిని నేను చూసినపుడు  శిధిలావస్థలో, మెట్లు చాల దూరంగా ఖనిలు ఉడిపోతాయ అన్నట్లు ఉండేవి. మన సీతారాంపురం గ్రామం, గ్రామపంచాయతిగా ఏర్పడే నాటికీ గ్రామంలో నీటి సమస్య విపరీతంగా ఉండే.

                                    
                                          గ్రామా పంచాయతి ఏర్పడిన తర్వాత మన మొదటి  గ్రామా సర్పంచ్ బస్వ రాం నర్సయ్య గారి  అధ్వర్యంలో అనేక బోర్లను, చేతి బోరు పంపులను వేఇంచడం,  నీటిని నిలువచేసే నీటి ట్యాంక్ లను నిర్మిచడం    జరిగింది మరియు పెద్ద ట్యాంక్ (ఓవర్ ట్యాంక్ ) ను కట్టి తద్వారా  ఇంటింటికీ నీటి అవసరాన్ని తీర్చడానికి వాడవాడకు నీటి పైపులైను లను వేఎంచి ప్రతి ఇంటికి నాల్లాలను ఏర్పాటు చేశారు. ఓవర్ ట్యాంక్ ని నిర్మించడం ద్వార కరంటు లేని సమయం లో కూడా నిటి సమస్య ను పారద్రోలడానికి కృషి చేశారు. గ్రామం లో ని సుమారుగా అన్ని  బోర్లు  ఉప్పు నీటి బోర్లె కావున త్రాగడానికి ఏమాత్రం అనువుగా లేకుండే, ఒక్క శివాలయం దగ్గరరుండే బోరు మాత్రమే మంచి నీటికి అనువుగా ఉండేది దానితో గ్రామ ప్రజలంతా మంచి నీళ్ళ కోసం బారులుతీసేవారు. మొత్తంమిద మన గ్రామం, గ్రామపంచాయతిగా ఏర్పడిన తరువాత నీటి విషయంలో కొంతవరకు మెరుగుపడింది. కానీ గ్రామంలో వేసిన పైపులైను మొత్తం 2 ఇంచ్లు, అక్కడక్కడ 2.50 ఇంచ్ల    పైపులను మాత్రమే   వేసి ముందు చూపు  లేకుండా వేశారనే చెప్పాలి. కానీ అప్పటి   భాద  అప్పడిదె అనట్లుగా నీటి సమస్యను మొత్తానికి విజయవంతంగా  పారద్రోలడానికి కృషి చేసినందుకు రాం నర్సయ్య గారికి కడవెండి సీతారాంపురం తరుపున అబినందనలు తెలియజేస్తున్నాను.
                                          ఇకపోతే సీతారాంపురం గ్రామ రెండవ సర్పంచ్ మరియు మొదటి మహిళా సర్పంచ్ ఐన నల్లగొండ శంకరమ్మ గారు నీటి సమస్య కోసం ఎక్కువగా కష్టా పడకుండా రాం నర్సయగారు చూపిన, చేసిన విధానాలకు అనుసరించి నీటి సమస్య రాకుండా మ్యానేజ్ చేశారంతే, కొత్తగా చేసిందేమీ  లేదు అనే చెప్పాలి కాకపోతే ఇంటింటికీ నీరు వస్తుందా లేదా అని పర్యవేక్షించేవారు. వీరి తర్వాత సీతారాంపురం గ్రామానికి మూడవ సర్పంచ్ గా బస్వ మలేష్ గారి హయంలో రాం నర్సయ్య గారు వెఇంచెన బోరులన్ని ఎండిపోయి నీటి కష్టాలు మొదలైనవి. దేనితో మలేష్ గారు గ్రామా నీటి సమస్యని తీర్చడానికి అనేక బోర్లను వెఇంచినప్పటికీ ఒక్క బోరు కూడా సరిగా   పడకపోవడంతో కొన్ని చోట్ల బోరుపంపులను బిగించి నీటి సౌకర్యని పెచారు. కానీ ప్రస్తుతం  పాత బోరులు 4 మాత్రమే నడుస్తున్నవి.  ఓవర్ ట్యాంక్ లోకి ఈ బోర్ల నీరు పోవాలంటే చాల ప్రెజర్తో నీటిని పోస్తే తప్ప అంత పైకి  ఎక్కవు 4 బోరులు కలసి 2 బోరులు పోసినట్లు  పోస్తున్నవి అంటే ఇప్పుడు సీతారాంపురం గ్రామానికి 2 బోరులే ఉన్నట్టు లెక్క , దీనిద్వారా గ్రామం లో నిటి సమస్య విపరీతంగా పెరిగింది. అక్కడక్కడ కొన్ని సేవసంఘలతో కలసి కొన్ని చేతి పంపులను వేఎంచారు కానీ ఆ నిరు చాల ఉప్పు నిరు కావున వాటి వినియోగం చాలాతక్కువ. కొన్ని బోరు పంపులు ప్రస్తుతం  కన్పిచడం లేదూ. గ్రామంలో మంచి నీటి సమస్య ని తీర్చడం కోసం నిధులు సేకరించి  శుద్ధనీటి పరికరాన్ని (వాటర్ ఫిల్టర్ మిషిన్) తెచ్చి మంచి నిటి సమస్యను సీతారాంపురం గ్రామంలో పూర్తిగా నిర్ములిన్చినందుకు కడవెండి సీతారాంపురం ద్వారా మల్లేష్ గారికి  అబినందనలు తెలియజేస్తున్నాను. కానీ గృహోపకరనలకు అవసరమైన నీటిలో మాత్రం విపలమైనారు.

                          గ్రామానికి 4వ సర్పంచ్,  రెండవసారి సీతారాంపురం గ్రామనికి  సర్పంచ్  గా వచ్చిన బస్వ మల్లేష్ గారు   ప్రస్తుత గ్రామ నీటి సమస్య గురించి పట్టించుకోని గ్రామంలో నీటి సమస్యను నిర్మూలించాలి.
                        వారికీ కడవెండి సీతారాంపురం తరుపునుండి కొన్ని సూచనలు అనికోండి, సలహాలనుకోండి ఇంకేమైనా అనుకోండి........

1)ప్రస్తుతం గ్రామంలో 4 బోర్లులే నడుస్తున్నవి, ఇంకో 5 బోరులను పడేవరకు వేఎంచాలి.
2)గ్రామంలోని అన్ని విదులల్లో ఉన్న పైపులైనులను ప్రక్షలనుగావించి, కొత్తగా   3 ఇంచుల పైపులైను లను వేఎంచాలి.
3)   బోరు బావి పంపులను పునరుద్దరించాలి.
4) ఓవర్ ట్యాంక్ వద్ద అవసరమైతే ఒక పెద్ద కులాయీ మాదిరి కట్టి, ఇక్కడినుండి మోటార్ల ద్వార ఓవర్ ట్యాంక్ లో నీటిని పొఎంచలి.
5) వీలైతే  గ్రామంలోని అన్ని విదులల్లొ ఉచిత నల్లాలను వేఇంచాలి.
6) నాల్లలను తెప్పువారు ( వాటర్ మెన్) అన్ని బజారులకు సమానముగా నీటిని విడుదల చెయ్యాలి, చేసేటట్లు చూడాలి.
7) అవసరమైతే ఒక జనరేటర్ తెచ్చి 24 గంటలు మోటారు ను నడిపించి నీటి సమస్యను తీర్చాలి.
8) ముఖ్యంగా నిటి వినియోగం పై గ్రామా ప్రజలకు అవగాహనను తేసుకరావాలి. నీరు సరిపోయీన తర్వాత నాల్లలను ముఎంచేల సూచించాలి.
9) అవసరమైతే గ్రామా ప్రజలనుండి కొన్ని నిదులను సేకరించి ఈ సమస్యలన్నీ తీర్చాలి.

       మీకు(కడవెండి సీతారాంపురం) తెలిసిన సమస్యలను కూడా జతచేయ్యండి. ఈ సమస్యలను గ్రామా సర్పంచ్ గారి దృష్టికి తేసుకేల్లడానికే  నా ఈ చిన్ని ప్రయత్నం........
(ఈ నీటి సమస్యని నేను ప్రేత్యేకంగా అనుభవించాను కనుకనే ఈ చిన్ని సలహా)

మీ,
కడవెండి సీతారాంపురం.

దసరా పండుగ వీడియో...

సీతారాంపురంలో మద్యం

మా ఊరిలో ఒక డాక్టర్ గారు మద్యం గురించి ఇలా సెలవిచ్చారు
మంచానికి పరిమితమైన ముసలోడు, పక్షవాతం వచ్చిన ముసలోడు, ఒళ్ళు నొప్పులునా కష్టజీవి, మద్యం వ్యసనంగా మారీ మంచంపట్టిన ముసలోడు, చావుకు దగ్గరైన ముసలోల్లదంరికి ఈ మద్యం ఒక మంచి తనిక్ ల పనిచేస్తుంది. వీరంతా మాంద్యాని సేవిన్చుతే వారం రోజుల్లో తిరిగి మాములు స్థితికి వస్తారు అని చెప్పాడు. ఇది ఎంతవరకు వాస్తవం? నేను యుట్యూబ్ లో ఒక డాక్టర్ గారు చెప్పింది విని అర్చేయ్యపోయాను. వీరు చెప్పింది ఏందంటే........

మనిషికి కాన్సోనంట్ స్పిరిట్ తగిన మోతాదులో అవసరం. రోజు మనిషికి
40--60 యం ఎల్ బ్రాంది, విస్కీ తీసుకుంటే హార్ట్ కు మంచిది వీటిలో ఉండే హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ఆంటి ఆక్సిడెంట్ గ పనిచేస్తాయి.
130--150 యం ఎల్ వైన్ , 350 యం ఎల్ బీర్ తీసుకుంటే మంచిది.
ఒకవేళ ఈ మోతాదుకు మించి తాగితే వాటిలో ఉండే టాక్సిస్ ప్రొడక్ట్స్ రిలీస్ అయ్యీ హార్ట్ డ్యామేజి అవుతుంది. మరొక డాక్టర్ గారు పైన చెప్పిన దానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలులేవని కాకపోతే చాల తక్కువ మొత్తంలో
అమావాస్యకో, పున్ననికో పండగలకో, పంక్షన్లకో, నెలకో, సంవత్సరానికో ఒకసారి మద్యం ని సేవిన్చితే పరవాలేదు కానీ రోజుకి,పుటకి, గంటకి, అర్ద గంటకి ఒకసారి తాగితే మాత్రం చాల ప్రమాదం అని సెలవిచ్చారు.

మా ఊరిలో ఒక్కప్పుడు దొంగచాటున సారా, కోటార్ సిసలు, బీర్లు మొదలగునవి ఒకటి , రెండు చోట్ల తప్ప మరేకడ దొరికేవి కావు. ప్రస్తుతం బ్రాంది షాప్లు 5 కు పైగానే ఉన్నవి. సాయంత్రం అయిందంటే చాలు ఎలాగు అందుబాటులో ఉంది కదా అని గ్రామా ప్రజలు మరియు యువత సహితం తక్కువ కాదు అన్నట్లు తెగ తాగుతున్నారు. తాగి రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలు, రోగాలు, పిల్లల పట్ల నిర్లక్ష్యం, ఉద్యోగ విధుల పట్ల అలసత్వం లాంటి వికృత ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది మా ఒక్క ఊరిలొని జరుగుతుంది అంటే పొరపాటు, ప్రతి ఊరిలో, ప్రతి పట్టనాలల్లో , ప్రతి దేశాలల్లో జరుగుతున్న వాస్తవం అని , మొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) కూడా పేర్కొంది. మద్యం వ్యసనంగా మారితే ఎయిడ్స్‌ కంటే ప్రమాదకారి అని కూడా తెప్పింది. ఇకపోతే మా ఊరి విషయాని కొస్తే మొన్న పండుగకు తాగి వాహనాన్ని నడపడం వల్ల ప్రమాదం జరిగి రెండు నిండు ప్రాణాలు బలైన విషయం అందరికి తెలుసు. ఆ సమయం లో మేము కొందరం కలసి మన ఊరిలో మద్యాన్ని, మద్యం షాప్లను ముషివేస్తే బాగుంటుందని చెప్పి గ్రామా ప్రజల్లో కొంతమందికి చెప్పాము , ప్రజల నుండి మాకు చేదు అనుభవం ఎదురైది . మన ఊరి లో షాప్ లు మూసివేసి నంత మాత్రాన తాగుడు బంజేస్తారా... , తాగేవాడు మన ఊరిలో కాకపోతే పక్క ఊరిలో తెచ్చుకొని తాగుతాడు...., ఈ రోజుల్లో ఎవడు తాగనోడు....., వాడు తాగి బండిని ఎందుకు నడపాలి.... , ఇలా తాగి సచ్చేటోడు సావని అన్ని కూడా సెలవిచ్చారు తప్పితే మేము బెల్ట్ షాప్ లను ముఎంచడానికి ఒప్పుకోము అన్నట్లుగా సమాదానం ఇచ్చారు. ఇదే సమస్యను సర్పంచ్ గారి దృష్టికి తేసుకేల్లుతే తప్పకుండ బెల్ట్ షాప్ లను ముఎంచడానికి కృషి చేస్తాను, మరో రెండు మూడు రోజుల్లో ముఎంచుత అనేటట్లు మాట్లాడి, హామీ ఇచ్చి 2 నెలలు దగ్గరి కోస్తున్న ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. సర్లే మన ప్రభుత్వానికి బుద్ది లేదు జనాల ప్రాణాలతో చలగాటం అడుతున్నారు. అసలు ఈ సమస్త్య ప్రపంచ సమస్యగా నేడు అందరిని పట్టిపిడిస్తుంది. ఇదంతా మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వాలు గుర్తిస్తుండటంతో ఈ సమస్య నెలకొంది.


మద్యపానం వల్ల కొన్ని నష్టాలు.......



1) ఒక్క చుక్కేఅనిఅనుకోవద్దు.కొన్నిచుక్కలుకలిసిమహాసముద్రమై జీవితాన్ని ముంచేస్తుంది.
2)మద్యపానం కుటుంబ నాశనం అని గుర్తుంచుకోవాలి.
3)మద్యం అల్లరిపాలు చేస్తుందని మరచిపోవద్దు.
4)మద్యపానం నిన్ను అప్పుల అప్పారావుగా చేస్తుంది.
5)మద్యపానం వల్ల ఒక్కోసారి ఉద్యోగాలూడతాయి.
6)మద్యపానం వల్ల ఇల్లు గుల్లవుతుందని తెలుసుకోవాలి.
7) శారీరక ,మానసిక ఆరోగ్యమ్ పై ప్రభావం చూపుతుంది.
 పురుష జన్యు లక్షణాలైన శుక్ర కణాలు నశిస్తాయి.
9)అలసిన, సొలసిన జీవితానికి త్రాగుడు కాదు, మంచి ఆహారం ముఖ్యం.
10) కేవలం మత్తును కలిగించే పదార్థాలు శాంతిని, నెమ్మదిని, విశ్రాంతినిస్తాయని తలచటం పొరబాటు. మానసిక, శారీరక విశ్రాంతిని సహజంగానే పొందడానికి అలవాటు పడాలి.
11)త్రాగుడు మా వంశపారంపర్య అలవాటు అని త్రాగే అలవాటును మీరు సమర్థించుకుంటే మీ జీవితాన్ని మీరే చేతులారా నాశనం
చేసుకున్నవాళ్ళు అవుతారన్న విషయం గ్రహించండి..
12) నరాల ఒత్తిడి, కోపం రేగినప్పుడు త్రాగుట వుత్తమం అని అనుకోవద్దు. అలా అది చిన్న పొరపాటు నుండి పెద్ద పొరపాటుకు అవుతుంది .

                                     ఖచ్చితంగా త్రాగుడు మానివేయాలి అనే దృడమైన కోరికను కలిగి వుండాలి. మద్యపానాన్ని మానలేకపోతున్నామని బాధపడేకంటే మానేందుకు మనంకనీస ప్రయత్నం చేస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి.
వీటన్నింటినీ దృష్టిలో వుంచుకుంటే మద్యపానాన్ని నీ అంతట నీవే మానివేయడానికి అవకాశం వుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మద్యం గురించి ఒక పుస్తకమే రాయవచ్చు.
ఓపికతో చదివినందుకు ధన్యవాదాలు!!

మీ,
కడవెండి సీతారాంపురం.